
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : అమెరికాలో విషాదం చోటుచేసుకుంది. వీకెండ్ను సరదాగా ఎంజాయ్ చేసేందుకు వెళ్లిన తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు తిరిగి విగతజీవులుగానే దొరికారు. వారాంతం కావటంతో మిస్సోరిలోని ఓజార్క్ లేక్లో ఇద్దరు స్నేహితులు ఈతకు వెళ్లగా ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న అక్కడి సిబ్బంది గాలింపు చేపట్టగా.. ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఇద్దరు విద్యార్థులు మిస్సోరిలోని సెయింట్ లూయిస్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు.
Read Also : నూతన సచివాలయ ప్రారంభానికి ముహూర్తం ఖరారు..!!!
హనుమకొండకు జనార్ధన్, ఝాన్సీ లక్ష్మీ కుమారుడు ఉత్తేజ్ హెల్త్ సైన్స్ డేటాలో మాస్టర్స్ చేసేందుకు గతేడాది ఆగస్టులో అమెరికా వెళ్లాడు. వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన అపెక్స్ ఆస్పత్రి యజమాని వెంకటేశం, జ్యోతి దంపతుల రెండో కుమారుడు శివదత్తు (25) కూడా వైద్య విద్య అభ్యసించేందుకు ఈ ఏడాది జనవరిలో అమెరికా వెళ్లాడు. సెయింట్ లూయిస్ వర్సిటీలో డెంటల్ ఎంఎస్ విద్య అభ్యసిస్తున్నాడు. శనివారం రోజు ఇద్దరు స్నేహితులు కలిసి ఓజార్క్ లేక్కు వెళ్లారు. సరస్సులో సరదాగా ఈత కొడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ఉత్తేజ్ నీటిలో మునిగిపోసాగాడు. బయటకు వచ్చేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఉత్తేజ్ ఇబ్బంది పడుతున్న విషయాన్ని గమనించిన శివదత్తు అతన్ని కాపాడేందుకు సరస్సులో దూకాడు.
Also Read : ముందస్తు ఎన్నికలపై మంత్రి హరీష్ రావు క్లారిటీ…. బీజేపీ నేతలు జ్యోతిష్యం చెబుతున్నారంటూ సెటైర్లు
అయితే శివదత్తు కూడా నీటిలో గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న అధికారులు సరస్సులో గాలించగా కొన్ని గంటల తర్వాత ఉత్తేజ్ మృతదేహాం లభించింది. తీవ్రంగా శ్రమించిన సిబ్బందికి తర్వాతి రోజు శివదత్త మృతదేహం దొరికింది. ఉన్నత విద్య కోసం విదేశాలు వెళ్లిన కుమారులు పట్టభద్రులై ఇంటికి తిరిగి వస్తారని గంపెడు ఆశలతో ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు ఊహించని రీతిలో మరణ వార్త వినిపించటంతో గుండెలవిసేలా రోధిస్తున్నారు. ఈ వార్త తెలిసి ఆ విద్యార్థుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ దుర్ఘటనపై స్పందించారు. మృత దేహాలను వీలైనంత త్వరగా స్వగ్రామాలకు తీసుకురావడానికి బాధిత కుటుంబాలకు సహాయం చేయాలని తన కార్యాలయానికి సూచించారు.
ఇవి కూడా చదవండి :
- రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్ట్ లో షాక్…. బండి పాదయాత్రకు అనుమతి
- యాదాద్రి థర్మల్ ప్లాంట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత…. భూములు కోల్పోయిన రైతులు ఆందోళన
- పీటీ ఉష చేతికి ఐఓఏ పగ్గాలు – అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికవనున్న అథ్లెటిక్స్ దిగ్గజం
- రిపబ్లిక్ వేడుకలకు చీఫ్ గెస్ట్గా ఈజిప్టు అధ్యక్షుడు..
- సాయి పల్లవి సినిమాలకు గుడ్బై చెప్పనుందా..?