
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఏనుగు దాడిలో జనం ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని గ్రామస్థులు ఆగ్రహించారు. మృతదేహంతో ఆందోళన చేస్తున్న గ్రామస్థులను పరామర్శించేందుకు ఎమ్మెల్యే వచ్చారు. అయితే, ఇంత ఆలస్యంగా రావడమేంటని మండిపడ్డ జనం.. సదరు ఎమ్మెల్యేను తరిమి కొట్టారు. పోలీసులు కల్పించుకుని అతికష్టం మీద ఎమ్మెల్యేను జనం బారి నుంచి కాపాడారు. కర్ణాటకలోని చిక్కమగళూరులో చోటుచేసుకుందీ ఘటన.
Read More : ప్రైవేట్ జెట్ లో వంద కోట్ల రూపాయలు తరలింపు? లిక్కర్ స్కాంలో కవితకు బిగిస్తున్న ఉచ్చు?
చిక్కమగళూరు చుట్టుపక్కల ప్రాంతంలో ఇటీవల ఏనుగుల దాడులు పెరిగిపోయాయి. తరచుగా ఏనుగుల బారిన పడి జనం చనిపోతున్నరు. ఏనుగుల బెడద నుంచి తమను కాపాడాలంటూ గ్రామస్థులు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. తాజాగా ఆదివారం మరో మహిళపై ఏనుగు దాడి చేసి చంపేసింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు మృతదేహంతో ఆందోళనకు దిగారు.
Read More : గవర్నర్ గా మర్రి శశిధర్ రెడ్డి? బీజేపీ పెద్దలతో హామీతోనే జంప్..
బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆదివారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే, బీజేపీ నేత ఎంపీ కుమార స్వామి గ్రామానికి వచ్చారు. అయితే, జనం చనిపోతున్నా పట్టించుకోరా..? మృతదేహంతో తాము ఉదయం నుంచి ఆందోళన చేస్తుంటే, తీరిగ్గా సాయంత్రానికి వస్తారా అని జనం ఎమ్మెల్యేను నిలదీశారు. ఎమ్మెల్యే కూడా అంతే తీవ్రంగా బదులివ్వడంతో మాటా మాటా పెరిగింది. రెచ్చిపోయిన జనం సదరు ఎమ్మెల్యేపై దాడి చేశారు. ఊళ్లో నుంచి తరిమి కొట్టారు. ఈలోపు అక్కడికి చేరుకున్న పోలీసులు అతికష్టం మీద ఎమ్మెల్యేను కాపాడి, అక్కడి నుంచి తరలించారు.
ఇవి కూడా చదవండి …
- కూసుకుంట్లకు మిగిలింది 10 నెలలేనా? వచ్చేసారి ఇంటికే పరిమితమా?
- మునుగోడులో తెరాస అదినేత స్పెషల్ సర్వే… పార్టీకి భంగం కలిగించే సొంత పార్టీ నేతలకు చెక్
- ఎమ్మెల్సీ పదవిపై కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు…. పదవితో తృప్తి లేదన్న నేత
- కాంగ్రెస్ పార్టీకి మర్రి శశిధర్ గుడ్ బై….. అధికారికంగా ప్రకటించిన సీనియర్ నేత
- కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి పార్టీ మార్పు వ్యవహారంపై స్పందించిన జగ్గారెడి…