
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా? జాతీయ రాజకీయాల కోసం ముఖ్యమంత్రి పదవిని కేసీఆర్ వదులుకోనున్నారా?.. ఆ రెండు అంశాలే తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. మంగళవారం సీఎం కేసీఆర్ పార్టీ కీలక సమావేశం నిర్వహిస్తుండటంతో.. ఏదైనా సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా అన్న చర్చ సాగుతోంది. కొన్ని రోజులుగా ప్రచారం సాగుతున్నట్లు అసెంబ్లీని రద్దు చేస్తారా అన్న అనుమానాలు కొన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కేటీఆర్ పట్టాభిషేకానికి కేసీఆర్ సిద్దమవుతున్నారనే టాక్ వస్తోంది.
Read More : రాజాసింగ్ భద్రతకు ముప్పు? పట్టించుకోని స్టేట్ ఇంటలిజెన్స్
తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మంగళవారం కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. తెలంగాణ భవన్లో జరగనున్న మీటింగ్ కు పార్టీ నేతలంతా హాజరుకానున్నారు. టీఆర్ఎస్ లెజిస్లేటివ్, పార్లమెంటరీ పార్టీతో పాటు టీఆర్ఎస్ కార్యవర్గంతో సంయుక్తంగా సీఎం కేసీఆర్ సమావేశంకానున్నారు. ఈ సమావేశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది. ఇంత సడెన్ గా పార్టీ నేతలంతా కవరయ్యేలా కీలక సమావేశం కేసీఆర్ ఎందుకు నిర్వహిస్తురన్నది ఆసక్తిగా మారింది. సీఎం కేసీఆర్ ఏం చేసినా దానికో లెక్క ఉంటుందంటారు. అసలు ఆయన పార్టీ సమావేశాలు చాలా తక్కువగా నిర్వహిస్తుంటారు. అలాంటిది లెజిస్లేటివ్, పార్లమెంటరీ పార్టీ, టీఆర్ఎస్ కార్యవర్గం సమావేశం సంయుక్తంగా నిర్వహిస్తుండటంతో ఏదో కీలక నిర్ణయం తీసుకోనున్నారనే చర్చ సాగుతోంది.
Read More : గుజరాత్ లో అసదుద్దీన్ కు షాక్… ఎంఐఎం ప్రచారంలో మోడీకి మద్దతుగా ముస్లింల నినాదాలు
కేసీఆర్ సమావేశంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. రకరకాల ప్రచారాలు తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించింది. మునుగోడు గెలుపు తర్వాత జరుగుతున్న సమావేశం కావడంతో దీనికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. 2018లోనూ కేసీఆర్ ముందస్తుకు వెళ్లారు. ఈసారి కూడా ముందస్తుకు వెళ్లవచ్చనే చర్చ సాగుతోంది. 2023 ఏప్రిల్, మేలో జరిగే కర్ణాటక ఎన్నికలతో పాటు తెలంగాణ ఎన్నికలు జరిగేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారనే టాక్ ఉంది. దీంతో మంగళవారం జరిగే సమావేశంలో ముందస్తు ఎన్నికలపై చర్చించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ముందస్తు ఎన్నికలపై పార్టీ నేతల అభిప్రాయాలను సీఎం తీసుకోనున్నారని తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై మంతనాలు జరపనున్నట్లు తెలుస్తోంది. దీంతో మంగళవారం భేటీలో అసెంబ్లీ రద్దు నిర్ణయం తీసుకుంటారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
Read More : లవర్ ను 35 ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టిన ఉన్మాది
తెలంగాణ పాలనలో కీలక మార్పులు జరగవచ్చనే ప్రచారం కొన్ని వర్గాల నుంచి వస్తోంది. జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన కేసీఆర్.. తెలంగాణలో పాలనా పగ్గాల నుంచి తప్పుకుంటారనే వార్తలు వస్తున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించి… కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ బలోపేతం దిశగా జాతీయ స్థాయిలో అడుగులు వేస్తారనే చర్చ సాగుతోంది. ఇటీవల కాలంలో మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలు కేటీఆర్ సీఎం కాబోతున్నారంటూ ఓపెన్ గానే ప్రకటనలు చేస్తున్నారు. దీంతో కేటీఆర్ కు పట్టాభిషేకం దిశగా కేసీఆర్ చర్యలు ఉండబోతున్నాయని.. మంగళవారం జరిగే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కేటీఆర్ నాయకత్వంలోనే సాగుతాయని కొందరు గులాబీ నేతలు చెబుతున్నారు.
అటు జాతీయ రాజకీయాలపై పార్టీ నేతలకు కేసీఆర్ కీలక సందేశం ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీకి ఆమోదం రాగానే పార్టీ నేతలు ఎలా పనిచేయాలి.. పార్టీ కమిటీలు, ఇతర రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాలపై చర్చించే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఎమ్మెల్యేల బేరసారాల వ్యవహారం వెలుగు చూడటంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ పర్యటనలో ప్రధాని మోడీ చేసిన కామెంట్లపైనా పార్టీ నేతలతో కేసీఆర్ చర్చిస్తారని అంటున్నారు.
ఇవి కూడా చదవండి …
- మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అరెస్ట్.. బీజేపీ దర్నాతో ఉద్రిక్తత
- నాకోసం అహర్నిశలు కష్టపడిన నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు…రాజగోపాల్ రెడ్డి
- క్రైమ్ మిర్రర్ కధనానికి స్పందన…. స్పందించిన అధికారులు, మాట నిలబెట్టుకున్న ఎంపీటీసీ….!!
- తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం కోసం కృషి చేస్తా….. కాసాని జ్ఞానేశ్వర్
- టిఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్న దుబ్బాక మండల బిజేపి అధ్యక్షుడు…
3 Comments