
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో సవాల్ గా మారిన మునుగోడు ఉప ఎన్నికలో ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సీఎం కేసీఆర్. మునుగోడు ఉప సమరంలో నేరుగా దిగబోతున్నారు. గురువారం మునుగోడు వెళ్లనున్న కేసీఆర్… అక్కడే ఉండనున్నారని తెలుస్తోంది. ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క రోజు.. అది కూడా రోజు విడిచి రోజు కేసీఆర్ ప్రచారం ప్లాన్ చేసుకున్నారని అంటున్నారు. మండలాలవారీగా.. ప్రచార పర్వానికి.. కేసీఆర్ వెళ్లేందుకు ప్లాన్ రెడీ చేసుకున్నారు. దీనిని ఏకాదశి.. గురువారం శుక్రవారం కలిసి వస్తున్నందున ఆ రోజుల్లో ప్రారంభించాలని.. కేసీఆర్ బావిస్తున్నట్టు తెలుస్తోంది.
Read More : ఒక గౌడ్ పోయిండు.. మరో గౌడ్ వచ్చిండు! మునుగోడులో గంటకో ట్విస్ట్..
ఢిల్లీ పర్యటనను ముగించుకొని కేసీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ అంత్యక్రియలకు వెళ్లిన కేసీఆర్ అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లారు. ఎనిమిది రోజులు అక్కడే ఉంటూ మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.వాస్తవానికి భారత్ రాష్ట్ర సమితి ప్రకటన తర్వాత తొలిసారి ఢిల్లీ వెళ్లిన కేసీఆర్.. బీఆర్ఎస్ కోసం సిద్ధమవుతున్న కార్యాలయాన్ని సందర్శించారు.కార్యాలయంలో చేయవలసిన మార్పుల గురించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ ఎనిమిది రోజులు ఢిల్లీలోనే ఉన్న కేసీఆర్ జాతీయ రాజకీ యాలపై కొందరి ముఖ్య నేతలతో సంభాషించి చర్చించారు. అనంతరం సీఎం స్వల్ప అస్వస్తతకు గురయ్యారు.. అక్కడే ఉంటూ చికిత్స తీసుకున్నా రు. ఢిల్లీలోనే రాష్ట్ర ముఖ్య అధికారులతో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు.
బుధవారం మధ్యాహ్నం తిరిగి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. ఇక గురువారం సాయంత్రం నుంచి మునుగోడులో పర్యటించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని అంటున్నారు. ఇక కేసీఆర్ రంగం లోకి దిగితే. ప్రతిపక్షాలపై నిప్పులు కురిపించడం ఖాయమని అంటున్నారు టీఆర్ ఎస్ నాయకులు.
ఇవి కూడా చదవండి …
- రాజగోపాల్ రెడ్డి సభను అడ్డుకుంటే ఐదు వేలు! మంత్రి జగదీశ్ రెడ్డి కుట్రలతోనే అల్లర్లు?
- పార్టీ మార్పుపై ఎమ్మెల్యే పద్మారావు సంచలన ప్రకటన..
- కేసీఆర్ కు అనారోగ్యం.. స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీకి అధికారులు.. ఏం జరుగుతోంది?
- మంత్రి మల్లారెడ్డికి చుక్కలు చూపిస్తున్న మునుగోడు ఓటర్లు..
- ఏపీ మంత్రి రోజాపై చెప్పులు, చీపుర్లతో దాడి
Thanks