
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన కొద్ది రోజుల క్రితం ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియల కోసం ఉత్తరప్రదేశ్ వెళ్లారు. అటు నుంచి ఢిల్లీ వెళ్లిన ఆయన అప్పటి నుంచి తుగ్లక్ రోడ్డులోని తన నివాసంలో ఉంటున్నారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు కేసీఆర్ దాదాపు మూడు రోజుల నుంచి అస్వస్థతతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది.దీంతో తన నివాసానికే వైద్యులను పిలిపించుకుని కేసీఆర్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నట్లు చెబుతున్నారు.
Read More : మంత్రి మల్లారెడ్డికి చుక్కలు చూపిస్తున్న మునుగోడు ఓటర్లు..
అనారోగ్యం రీత్యా కేసీఆర్ మరో రెండు మూడు రోజుల పాటు ఢిల్లీలోని ఉండాల్సి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అందుకే తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉన్నతాధికారులను అత్యవసరంగా ఢిల్లీ రావాలని కేసీఆర్ ఆదేశించడంతో తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఐ అండ్ పిఆర్ కమిషనర్ అరవింద్ కుమార్ సహా పలువురు ఉన్నతాధికారులు స్పెషల్ ఫ్లైట్ లో హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లినట్లు తెలుస్తోంది.ఢిల్లీలో రాష్ట్ర అధికారులతో పాలనాపరమైన అంశాల మీద కేసీఆర్ చర్చలు జరిపే అవకాశం ఉందని అంటున్నారు. ఇక తెలంగాణకు రావాల్సిన నిధులపై సమాచారం తీసుకుని అస్వస్థత తగ్గిన తర్వాత కేంద్ర పెద్దలను కలిసే అవకాశం కూడా ఉందని అంటున్నారు.
Read More : ఏపీ మంత్రి రోజాపై చెప్పులు, చీపుర్లతో దాడి …
ఇక సుమారు వారం రోజుల నుంచి కేసీఆర్ ఢిల్లీలో ఉండడంతో టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆయన ఇంకా ఎన్ని రోజులు ఢిల్లీలో ఉంటారు? ఎప్పుడు హైదరాబాద్ వస్తారు? అనే విషయం మీద కూడా టీఆర్ఎస్ శ్రేణులకు ఎలాంటి సమాచారం లేదని తెలుస్తోంది.ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ అక్కడ టిఆర్ఎస్ పార్టీ కోసం లీజుకు తీసుకున్న ఒక భవనానికి సంబంధించిన మరమ్మత్తు పనులు పరిశీలించారని అలాగే ఢిల్లీలో పార్టీ కోసం కొత్తగా నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులను కూడా పరిశీలించి పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అయితే కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వం అధికారిక ప్రకటన ఏదైనా చేసే అవకాశం కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి …