NalgondaTelangana

మునుగోడు మూడు పార్టీలకూ సవాలే… సిట్టింగ్‌ సీటు నిలబెట్టుకుంటేనే కాంగ్రెస్‌కు పుట్టగతులు

చావో రేవో తెల్చుకునేందుకు సిద్ధమైన కాంగ్రెస్‌ పార్టీ మరోమారు తెలంగాణలో తన బలిమిని చాటాలనిచూస్తోంది. ఈ మూడు పార్టీల అభ్యర్థులు ఎవరన్నది తేలిపోయింది.

క్రైమ్ మిర్రర్, నల్లగొండ నిఘా ప్రతినిధి : మరో ఏడాదిలోపు రాష్ట్ర శాసనసభ ఎన్నికలు రానున్న వేళ మునుగోడు ఉప ఎన్నిక మూడు ప్రధాన రాజకీయ పార్టీలకు సవాల్‌ కానుంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు సిద్ధమైన అధికార పార్టీ టిఆర్‌ఎస్‌కు కూడా ఈ ఉప ఎన్నిక పెద్ద సవాల్‌ విసురుతోంది. ఎలాగైనా అధికా రాన్ని చేజిక్కించుకునేందుకు వ్యూహాలు పన్నుతున్న భాజపా ఇక్కడ గెలవడం ద్వారా తెలంగాణలో సత్తా చాటాలని చూస్తోంది. చావో రేవో తెల్చుకునేందుకు సిద్ధమైన కాంగ్రెస్‌ పార్టీ మరోమారు తెలంగాణలో తన బలిమిని చాటాలనిచూస్తోంది. ఈ మూడు పార్టీల అభ్యర్థులు ఎవరన్నది తేలిపోయింది. బిజెపి నుంచి రాజగోపాల్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి పాల్వాయి స్రవంతి ఇప్పటికే ఖరారు కాగా, తాజాగా టిఆర్‌ఎస్‌ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి ‘పేరును కెసిఆర్‌ ఖరారు చేశారు.

Read More : కబ్జా చేసిన కన్నెత్తి చూడరా… సుమారు 3 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా

అనుకోని పరిస్థితుల్లో వచ్చిన మునుగోడు ఉపఎన్నిక రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ తరఫున గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి… ఆ పార్టీని వీడటం, ఎమ్మెల్యే పదవికి రాజీనామాతో ఉపఎన్నిక అనివార్యమైంది. ప్రధాన పార్టీల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికగా మునుగోడు పోరును రాజకీయ పార్టీలు ఛాలెంజ్‌గా తీసుకుంటున్న తరుణంలో… గెలుపే లక్ష్యంగా ఎవరికి వారు తొలి నుంచి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎనిమిదన్నరేళ్లుగా అధికారంలో ఉండి… తిరుగులేని విజయాలు సొంతం చేసుకున్న తెరాస… అనంతరం వచ్చిన జీహెచ్‌ఎంసీ, దుబ్బాక, హుజురాబాద్‌ ఫలితాలతో దెబ్బతింది… ఈ ఎదురుదెబ్బలను విశ్లేషించుకున్న గులాబీ పార్టీ… ప్రత్యర్థులకు ఏ చిన్న అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడుతోంది.

Read More : మునుగోడు టీఆర్ఎస్‌లో అస‌మ్మ‌తి సెగ‌లు… సీనియ‌ర్ల‌కు స‌రైన ప్రాధాన్య‌మివ్వ‌డంలేద‌ని ఆరోప‌ణ‌లు

రాష్ట్రంలో బలపడుతున్న భాజపా వల్ల, జాతీయ రాజకీయాల్లో అడుగుపెడుతున్న సందర్భంలో మునుగోడు ఉపఎన్నిక తెరాసకు సవాల్‌గా మారింది. సీఎం కేసీఆర్‌ ఇమేజ్‌, ప్రభుత్వ సంక్షేమ పథకాలనే ప్రధానంగా నమ్ముకొని బరిలోకి దిగుతున్న తెరాస ఇప్పటికే దాదాపు అన్ని గ్రామాల్లో ఒక విడత ప్రచారాన్ని పూర్తి చేసింది. ఆత్మీయ సమ్మేళనాలు, దళిత వాడల్లో సహపంక్తి భోజనాలు వంటి కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లింది. కేటీఆర్‌, హరీశ్‌ రావుతో సహా 86 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నియోజకవర్గంలో దిగనున్నారు. సుమారు 2వేల ఓటర్లకు ఒక కీలక నేతకు బాధ్యత అప్పగించారు. తెరాస పేరు మార్పు, భారాస ప్రకటన అంశంపై ఇప్పటి వరకు నిమగ్నమైన కేసీఆర్‌… ఇక పోలింగ్‌ ముగిసే వరకు మునుగోడుపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.

Read More : నెల రోజుల్లో నాలుగు పార్టీలు జంప్.. మునుగోడు లీడరా నీకు సెల్యూట్!

గతంలో మునుగోడులో సభ నిర్వహించిన కేసీఆర్‌… ప్రచార గడువు ముగిసే ఒకటి, రెండు రోజుల ముందు చండూరులో భారీ సభ పెట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేశారు. సర్వేలు అనుకూలంగా ఉన్నప్పటికీ… ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయకుండా చివరి వరకు అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేస్తున్నారు. వామపక్షాల పొత్తు మునుగోడులో కచ్చితంగా లాభం చేకూరుస్తుందనే ఆశతో గులాబీ పార్టీ ఉంది. సీపీఐ, సీపీఎం ఓట్లన్నీ తెరాసకే బదిలీ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెరాస, వామపక్షాల నేతలతో గ్రామస్థాయి నుంచి సమన్వయ కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. చావో రేవో తేల్చుకునేందుకు సిద్ధమైన కాంగ్రెస్‌… మునుగోడు ఉప ఎన్నికల ప్రచారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

Read More : ఐదొందలు ఇస్తే పొట్టుపొట్టు తిట్టింది.. వెయ్యి తీసుకుని జై కొట్టింది!

వరుస పరాజయాలతో సతమతమవుతున్న హస్తం పార్టీ… సిట్టింగ్‌ స్థానాన్ని కైవసం చేసుకోవటమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే దివంగత నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె స్రవంతిని బరిలోకి దించింది. బూత్‌ స్థాయిలో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. నియోజక వర్గంలోని మొత్తం బూతులను ఒక్కో క్లస్టర్‌ పరిధిలోకి పదేసి లెక్కన 30 వరకు విభజన చేశారు.బూతు స్థాయిలో సమన్వయకర్తలను ఏర్పాటు చేయడంతోపాటు క్లస్టర్‌ స్థాయిలో ఇంఛార్జిలను, ప్రతి మండలానికి ఇద్దరు నుంచి ముగ్గురు వరకు అటాచ్‌మెంట్‌ ఇంఛార్జిలను నియమించారు. వీరు కాకుండా మండలాలకు, మున్సిపాలిటీలకు వేర్వేరుగా సీనియర్‌ నాయకులు ఇంచార్జిలుగా కొనసాగుతున్నారు. వీరంతా కూడా 14వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో ఉండి ప్రచారం వేగవంతం చేయనున్నారు. అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఇప్పటికే 5 మండలాల్లో ఇంటింటి ప్రచారం పూర్తి చేయగా మరో రెండు మండలాలు చేయాల్సి ఉంది.

Read More : దేశ రాజకీయాల్లోకి గ్రాండ్‌ ఎంట్రీ.. 80 కోట్లతో చార్టెడ్‌ ఫ్లైట్‌ కొననున్న కేసీఆర్

పాల్వాయి స్రవంతి తరఫున ఈ నెల 11న రెండు సెట్లు నామినేషన్లు వేస్తారు. ఆ తరువాత 14న భారీ జనసమికరణతో మరొకసారి నామినేషన్లు వేయనున్నారు. ఇక మునుగోడులో భాజపా సైతం దూకుడు పెంచింది. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి భాజపాలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి… స్థానికంగానే ఉంటూ ప్రచారం చేస్తున్నారు. పలు పార్టీలకు చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలను భాజపాలో చేర్చుకుంటూ పార్టీని స్థానికంగా బలోపేతం చేస్తున్నారు. సోమవారం రాజగోపాల్‌రెడ్డి నామినేషన్‌ వేసే అవకాశం ఉందని భాజపా నేతలు పేర్కొన్నారు. భాజపా జాతీయ కార్యదర్శి సునీల్‌ బన్సల్‌, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ తరుణ్‌చుగ్‌ విజయమే లక్ష్యంగా పనిచేయాలని శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. అటు కాంగ్రెస్‌, భాజపా మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

ad 728x120 SRI swami - Crime Mirror

ఇవి కూడా చదవండి …

  1. మునుగోడులో కమలానికి కదిలిపోతున్న యువత.
  2. కూసుకుంట్లకు టీఆర్ఎస్ టికెట్.. సంబరాల్లో కోమటిరెడ్డి క్యాంప్!
  3. మునుగోడు అధికార పార్టీ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
  4. మునుగోడు టిఆర్ఎస్ లో ముసలం.. కూసుకుంట్లకు టికెట్ ఇవ్వవద్దని సొంత పార్టీ నేతల డిమాండ్
  5. మునుగోడు ఉపఎన్నికలో ఓటుకు 30 వేలు!

Show More

Related Articles

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.