
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : కేంద్ర దర్యాప్తు సంస్థలు కొన్ని రోజులుగా తెలంగాణలో దూకుడు పెంచాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ, ఈడీ దాడులు కలకలం రేపాయి. పీఎఫ్ఐ కేసులో ఎన్ఐఏతో పాటు ఈడీ ముమ్మర తనిఖీలు చేసింది. కేంద్ర సంస్థల దాడులన్ని టీఆర్ఎస్ నేతల టార్గెట్ గానే సాగుతున్నాయి. ఫెమా నిబంధనల ఉల్లంఘన కేసులో అధికార పార్టీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఈడీ ప్రశ్నించింది. రెండు రోజుల పాటు ఎమ్మెల్యేను విచారించిన ఈడీ అధికారులు.. విదేశాల్లో జరిగిన నగదు లావాదేవీలు, మనీ లాండరింగ్ కు సంబంధించిన వివరాలు రాబడుతున్నారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈడి విచారణ తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది.
Read More : మంత్రి జగదీశ్ రెడ్డిపై బీసీల తిరుగుబాటు? మునుగోడులో కూసుకుంట్లకు మూడో స్థానమే!
ఎమ్మెల్యే కిషన్ రెడ్డిని ఈడీ ప్రశ్నించడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని డాన్ తో పోల్చారు. మంచిరెడ్డి దావూద్ ఇబ్రహీంని దాటి పోయారని అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో వేలాది ఎకరాలను స్వాహా చేశారని ఆరోపించారు. దశాబ్దాల కింద ఇందిరాగాంధీ పేదలకు పంచిన అసైన్డ్ భూములను ఎమ్మెల్యే అక్రమంగా లాక్కున్నారని మండిపడ్డారు. నర హంతకుడు నయీమొద్దీన్ తో రైతులను బెదిరించి భూములు కబ్జా చేశాడని మల్ రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి తన బినామీల దగ్గర పెట్టారని అన్నారు. చెరువు భూములను అమ్మేసి కోట్లాది రూపాయలు కూడబెట్టారని మల్ రెడ్డి ధ్వజమెత్తారు. ఫార్మా సీటీకి సేకరించి 8632 ఎకరాల అసైన్డ్ భూమిలో 200 ఎకరాలు కిషన్ రెడ్డి కొట్టేశారని ఆరోపించారు.
Read More : ఢిల్లీలో కలిసిపోతున్న కాంగ్రెస్-టీఆర్ఎస్! మునుగోడులో ఏం జరుగుతుందో?
మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై 2015లో హవాలా కేసు నమోదైందని ఈడీనే చెబుతుందన్నారు మల్ రెడ్డి. ఎమ్మెల్యే చేసిన మనీ లాండరింగ్ కి హవాలా డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఉన్న ఆస్తులు ఎన్ని..? ఇప్పుడేంతో తేల్చాలన్నారు. ఏ వ్యాపారం చేసి వందల కోట్ల రూపాయలు కూడబెట్టాడో కిషన్ రెడ్డి ప్రజలకు చెప్పాలన్నారు. అవినితీ ఎమ్మెల్యేను కేసీఆర్ వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలని మల్ రెడ్డి రంగారెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే ముఖ్యమంత్రి అండతోనే అక్రమాలకు పాల్పడ్డారని భావించాల్సి ఉంటుందన్నారు రంగారెడ్డి. ఆరు నెలల క్రితం మాదాపూర్ లో పేకాట ఆడుతూ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి పోలీసులకు పట్టుబడ్డారని ఆరోపించారు. కిషన్ రెడ్డి అక్రమాలపై ఈడీ విచారణ ఒక్కటే సరిపోదని.. సీబీఐ, ఐటీ శాఖలతో కూడా విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత మల్ రెడ్డి రంగారెడ్డి డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి …
- మర్రిగూడ దళిత వనబోజన కార్యక్రమంలో అవినీతి… ఎస్సి వాడలకు దూరంగా ప్రోగ్రాం.
- నవంబర్ 8న మునుగోడు పోలింగ్.. దసరాకి ముందే షెడ్యూల్ ?
- పదవులను ఆశించకుండా ప్రజాసేవయే లక్ష్యంగా పని చేసిన వ్యక్తి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ
- ఈడి, సిబిఐలు బిజెపి జేబు సంస్థలుగా మారాయి… రంగారెడ్డి టిఆర్ఎస్ నేతల ఆరోపణలు
- మంత్రి జగదీశ్ రెడ్డిపై బీసీల తిరుగుబాటు? మునుగోడులో కూసుకుంట్లకు మూడో స్థానమే!
2 Comments