HyderabadTelangana

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. కేసీఆర్ కోవర్టా?

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పాదయాత్ర చేస్తున్న వైఎస్ షర్మిల.. టీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. జగ్గారెడ్డి..మంత్రి కేటీఆర్ కోవర్ట్ అని మండిపడ్డారు. వైఎస్‌ఆర్ పార్టీలోకి పిలిచారని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. వైఎస్‌ఆర్ పార్టీ మారాడా..ఎప్పుడు మారాడో చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్‌ఆర్ గెలిచిన పార్టీయే కాంగ్రెస్‌లో కలిసిపోయిందన్నారు. పార్టీలు మారే అలవాటు వైఎస్‌ఆర్‌కు లేదన్నారు.

Read More : మంత్రి జగదీశ్ రెడ్డిపై బీసీల తిరుగుబాటు? మునుగోడులో కూసుకుంట్లకు మూడో స్థానమే!

జగ్గారెడ్డిలా పార్టీలు మారి నీచ రాజకీయాలు చేసే సంస్కృతి వైఎస్ఆర్‌ది కాదని స్పష్టం చేశారు. పొద్దున టీఆర్ఎస్, మధ్యాహ్నం బీజేపీ, సాయంత్రం కాంగ్రెస్‌..ఎవరు పిలిస్తే అక్కడికి పోతావు అని ఆరోపించారు. ఎవరికీ కథలు చెబుతున్నారని విమర్శించారు. ఒకరోజైనా ఒక ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు అని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించావా అని వైఎస్ షర్మిల మండిపడ్డారు. సంగారెడ్డి ప్రజల కోసం ఒక్కరోజైనా పని చేశావా అని ప్రశ్నించారు.

Read More : రెడ్లకు రెడ్ కార్పెట్.. బీసీలకు చావు డప్పు! ఇదేందయా జగదీశ్ రెడ్డి..? మునుగోడులో కారును ముంచేస్తావా?

టీఆర్ఎస్ మంత్రి ఒకరు సంగారెడ్డి ప్రాంతాన్ని దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారని..ఆ తర్వాత అక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. దీనిపై ఎందుకు పోరాడలేదని మండిపడ్డారు వైఎస్ షర్మిల. మీ వల్ల లాభం లేని సంగారెడ్డికి జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా ఉంటే ఎంత..లేకుంటే ఎంత అని విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారు..రేపు ఏ పార్టీలో ఉంటావో తనకే క్లారిటీ లేదన్నారు. అలాంటి వ్యక్తి తమ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు షర్మిల.

Read More : వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పోటీ చేసేది అక్కడి నుంచే?

ఇవాళ మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి..సీఎం వైఎస్ జగన్, షర్మిలపై మండిపడ్డారు. ఆమె ఎందు కోసం పాదయాత్ర చేస్తున్నారో చెప్పాలన్నారు. నాయకులను తిట్టేందుకు..వ్యక్తిగతంగా బురద చల్లేందుకు పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు. వైఎస్‌ఆర్ కుమార్తె అయినంత మాత్రన విమర్శిస్తే ఊరుకుంటామా అంటూ ఫైర్ అయ్యారు. తండ్రి వైఎస్‌ఆర్ బాటలో ఆమె నడవడం లేదన్నారు. బీజేపీ డైరెక్షన్‌లోనే జగన్, షర్మిల నడుచుకుంటున్నారని ఆరోపించారు.వీరిద్దరూ బీజేపీ వదిలిన బాణాలేనని విమర్శించారు. మోదీ, అమిత్ షా చెప్పినట్లు జగన్, షర్మిల నడుచుకుంటున్నారని తెలిపారు. హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్ర ఓట్లను చీల్చి బీజేపీకి ఉపయోగపడాలనేదే వారి ఉద్దేశమన్నారు. జగ్గారెడ్డి వ్యాఖ్యలపై తాజాగా వైఎస్ షర్మిల స్పందించారు.

ad 728x120 SRI copy - Crime Mirror

ఇవి కూడా చదవండి …

  1. ప్రపంచ గుర్తింపు సాధించిన మలబార్ గోల్డ్ సంస్థ
  2. ఢిల్లీలో కలిసిపోతున్న కాంగ్రెస్-టీఆర్ఎస్! మునుగోడులో ఏం జరుగుతుందో?
  3. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గెలవాలని కేసీఆర్ ప్లాన్! కాంగ్రెస్ ను చంపే కుట్రన్న రేవంత్ రెడ్డి
  4. అల్లాపూర్ వివేకానంద నగర్ లో ధూంధాంగా బతుకమ్మ సంబరాలు
  5. మునుగోడులో బీజేపీ జోరు.. మంత్రి జగదీశ్ రెడ్డికి సీఎం కేసీఆర్ క్లాస్

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.