
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్లో భాగంగా ఈ నెల 25న జరిగే మూడో టీ20కి హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. అయితే ఈ మ్యాచ్ను కళ్లారా చూసేందుకు టిక్కెట్ల కోసం అభిమానులు పోటీ పడుతుంటే హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ తీరు వారికి తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. మ్యాచ్ టికెట్లు సికింద్రాబాద్ జింఖానా హెచ్సీఏ కార్యాలయంలో మంగళవారం నుంచి లభిస్తాయని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ కావడంతో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఇతర జిల్లాల నుంచి క్రికెట్ అభిమానుల తెల్లవారుజాము నుంచే గ్రౌండ్ వద్ద బారులు తీరారు.
Read More : మునుగోడు బై పోల్ డేట్ ఫిక్సైందా? కేసీఆర్ అత్యవసర సమావేశం అందుకేనా?
అయితే టిక్కెట్ల ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవాలని నిర్వాహకులు చెప్పడంతో వారు తీవ్ర నిరసన తెలిపారు. హెచ్సీఏకి, అజారుద్దీన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకారులను అక్కడి వెళ్లిపోవాలని హెచ్సీఏ సిబ్బంది కోరినా వారు వినిపించుకోలేదు. దీంతో సెక్యూరిటీ సిబ్బందిపై వారిపై లాఠీఛార్జి చేశారు. యువకులు బయటికి పరుగులు తీయడంతో లంబా టాకీస్ రోడ్డు వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ పరిణామాలతో వాహనదారులు ఇబ్బందులు పడటంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ట్రాఫిక్ని క్లియర్ చేశారు. అయితే తమకు టిక్కెట్ల ఇచ్చేవరకు హెచ్సీఏ కార్యాలయం ఎదుట నుంచి కదిలేది లేదని క్రికెట్ ఫ్యాన్స్ తెగేసి చెబుతున్నారు. మ్యాచ్ టిక్కెట్లు ఆన్లైన్లో అందుబాటులో లేవని.. అందువల్లే నేరుగా తీసుకుందామని 14వ తేదీ నుంచి తిరుగుతుంటే తమకు పట్టించుకునేవారే లేరని వాపోతున్నారు.
Read More : మునుగోడు ఉప ఎన్నిక రేవంత్కు పరీక్ష… ఓడితే నష్టోపోయేది ముందగా రేవంతే
హెచ్సీఏ తీరుతో క్రికెట్ మ్యాచ్ చూడాలన్న ఆసక్తి కూడా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్న వారికి కూడా డబ్బులు రీఫండ్ చేస్తున్నారని , 55 వేల సామర్థ్యం ఉన్న ఉప్పల్ మైదానంలో హెచ్సీఏ అధికారులు బ్లాక్లో టికెట్లు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని క్రికెట్ అభిమానులు ఆరోపిస్తున్నారు. క్రికెట్ పట్ల ఉన్న అభిమానంతో ఇక్కడికి వస్తే తమ మనోభావాలు దెబ్బతిని విధంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహరిస్తుందని మండిపడ్డారు. వందల సంఖ్యలో క్రికెట్ అభిమానులు ఇక్కడికి చేరుకోవడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి :
- ఏసీబీకి చిక్కిన బడంగ్పేట్ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్…
- అక్రమ మట్టి రవాణాలో రెవెన్యూ హస్తం…?
- మావోయిస్టు అగ్రనేత భార్య లొంగుబాటు… సాయంత్రం డీజీపీ ఆధ్వర్యంలో మీడియా ఎదుట హాజరు
- గుట్కా, పాన్ మసాలా విక్రయాలపై హైకోర్ట్ సంచలన నిర్ణయం….
- లిఫ్ట్ అడిగి ఇంజెక్షన్తో హత్య చేసిన కేసులో కీలక మలుపు…
One Comment