HyderabadTelangana

జూబ్లీహిల్స్ ఘటనలో మహిళే మహానటి…. వెలుగులోకి ఊహించని ట్విస్ట్

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంట గోపీనాథ్ పీఏ విజయసింహ తనపై కత్తితో దాడి చేశాడని, తనను లైంగికంగా వేధిస్తున్నాడని నిషా అనే మహిళ పెట్టిన కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ వ్యవహారంలో నిషానే నిందితురాలిగా గుర్తించడం అందర్నీ ఒక్క సారిగా షాక్ కు గురిచేసింది. విజయ్ సింహా ఆదివారం అర్ధరాత్రి బేగంపేటలోని బీఎస్‌మక్తా వద్ద ఉన్న ఆమె ఇంట్లో ఓ మహిళను లైంగికంగా వేధించి, ఆమె ఇంట్లోకి చొరబడి, బెదిరించి, చివరకు బాధితురాలిపై దాడి చేశాడని చెప్పింది.

Read Also : మునుగోడు టిఆర్ఎస్ లో ఎవరికీ వారే… ఏకతాటి పైకి తెచ్చేందుకు ప్రయత్నించని మంత్రి, ఎమ్మెల్యేలు

ఈవెంట్స్ చేసుకుంటూ జీవనం సాగించే సదరు మహిళ ఫేస్‌బుక్ స్నేహితుడైన నిందితుడు విజయ్ సింహా, వాట్సాప్ వీడియో కాల్‌లో ఆమెకు కాల్ చేసి నగ్నంగా కనిపించి, నగ్నంగా ఉండమని అడిగాడని, అయితే ఆమె అతని అభ్యర్థనను తిరస్కరించానని, కాల్ కట్ చేసి అతని ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేశానని పేర్కొంది. కొంతసేపటికి నేరుగా ఆమె ఇంటికి వెళ్లి లైంగిక దాడి చేసి, తన గొంతు కోశాడని మహిళ ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. విజయ్ సింహా తనకు రాజకీయ నేపథ్యం ఉందని, అతను ఏదైనా చేయగలడని పేర్కొన్నాడని తెలిపింది. ఆపై మెడపై, ఎడమ చేతి మణికట్టు మీద కోశాడని పేర్కొంది.

Also Read : వ్యభిచారం చేస్తున్నారంటూ ఇద్దరు మహిళలకు గుండు… నల్గొండ జిల్లాలో దారుణం

అతను అక్కడ నుండి పారిపోయిన తర్వాత మహిళ తన కుటుంబ సభ్యులకు, పోలీసులకు జరిగిన దాడి గురించి ఫిర్యాదు చేశానని చెప్పింది. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ 448,354ఏ, 324, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులకు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఇదంతా మహిళ అయిన డ్రామాగా పోలీసులు నిగ్గు తేల్చారు. విజయ సింహా పై కోపంతో ఉన్న మహిళ అతన్ని ఏదోవిధంగా కేసులో ఇరికించాలన్న ఉద్దేశంతో ఈ డ్రామా ఆడినట్టుగా తెలుస్తుంది. ఇక అసలు ఏం జరిగిందంటే విజయ్ సింహాకు నిషా తో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది.

Read Also : మునుగోడులో మారుతున్న ఈక్వేషన్స్… బీసీకే టీఆర్ఎస్ టికెట్?

అది కాస్త వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇక విజయసింహ అప్పుడప్పుడు ఆమె ఇంటికి వెళ్లి రావడం ఇద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరగడం జరిగింది. అయితే ఈమధ్య విజయసింహ నిషా ను దూరం పెట్టాడు. ఎన్నిసార్లు పిలిచినా ఆమె వద్దకు వెళ్లడం లేదు. దీంతో అతనిపై కోపం పెంచుకుని ప్రతీకారం తీర్చుకోవాలని భావించిన మహిళ ఈ దాడి నాటకానికి తెరతీసింది. తనను లైంగికంగా వేధించాడని, తన గొంతు కోశాడు అని అబద్ధం చెప్పి కేసు పెట్టిన నిషా మెడపై ఎటువంటి గాయం లేదని వైద్యులు తేల్చారు.

Also Read : గుట్టుగా గుట్కా…. చోద్యం చూస్తున్న అధికారులు

అంతేకాదు నిషా చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని ఆయన తన ఇంట్లోనే ఉన్నారని విజయసింహ ఆధారాలతో సహా మీడియా ముందుకు వచ్చాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు నిషా ని విచారించగా తనను దూరం పెడుతున్నాడు అన్న కోపంతోనే, ఈ పని చేసినట్లు గా పేర్కొంది. విజయ్ సింహ ను ఇరికించాలన్న ఉద్దేశంతోనే డ్రామా ఆడినట్టుగా ఒప్పుకుంది. దీంతో పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. ఈ వ్యవహారంపై విజయసింహ ఇంతవరకు ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు మహిళపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. అయితే కేసును, పోలీసులను తప్పుదారి పట్టించినందుకు పోలీసులు నిషాపై కేసు నమోదు చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి :

  1. బ్యూరోక్రాట్లా… భజనపరులా! సూర్యాపేట ఎస్పీ, సంగారెడ్డి కలెక్టర్లు తీరుపై జనాల గుస్సా..
  2. తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరగనుందా?
  3. ఖమ్మం జిల్లాలో దారుణం… లిఫ్ట్ అడిగి విషపు ఇంజెక్షన్ ఇచ్చి హత్య
  4. కాన్పు పోయమంటే కాటికి పంపారు… గర్భిణి పొట్టపై కాళ్లతో తొక్కిన నర్సులు
  5. ఫైల్ కదలాలంటే పైసలు ఇవ్వాల్సిందే… బిల్డింగ్ పర్మిషన్ కోసం 10 వేలు డిమాండ్..

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.