
క్రైమ్ మిర్రర్, నల్గొండ నిఘా ప్రతినిది : నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరు మహిళలకు గ్రామ పెద్దలే గుండు కొట్టించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కొండమల్లేపల్లి మండలం రాముని తండాలో ఇటీవల ఓ యువకుడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తండావాసులు ఇద్దరు మహిళలకు శిరోముండనం చేయించారు. తండాకు చెందిన ఇంటర్ విద్యార్థి రాజు ఈ నెల14న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు రాజు అంత్యక్రియల అనంతరం అతడి ఫోన్ తనిఖీ చేయగా తండాకు చెందిన ఇద్దరు మహిళలతో అతను చేసిన సంభాషణలు బయటపడ్డాయి. దీంతో రాజు మృతికి సదరు ఇద్దరు మహిళలే కారణమని ఆరోపిస్తూ శనివారం తండా పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు.
Read More : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు దమ్ముంటే పాదయాత్ర అప్పండి…. వైఎస్ షర్మిల సవాల్
రాజు ఆత్మహత్యకు తమకు సంబంధం లేదని మొత్తుకున్నా గ్రామ సర్పంచ్, పంచాయతీ పెద్దలు వినిపించుకోలేదు. పంచాయతీ సందర్భంగా ఆవేశానికి లోనైన తండావాసులు వారిని వ్యభిచారులని నిందిస్తు విపరీతంగా కొట్టి ఆ ఇద్దరు మహిళలకు శిరోముండనం చేశారు.ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే కుల బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై ఆలస్యంగా సమాచారం అందుకున్న దేవరకొండ డివిజన్ పోలీసులు తండాకు వెళ్లగా ఇది తమ గ్రామ ఆచారామంటూ వారిని వెనక్కి పంపించేశారు. ఈ వివాదంపై ప్రస్తుతానికి పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.
ఇవి కూడా చదవండి …
- మునుగోడులో మారుతున్న ఈక్వేషన్స్… బీసీకే టీఆర్ఎస్ టికెట్?
- బ్యూరోక్రాట్లా… భజనపరులా! సూర్యాపేట ఎస్పీ, సంగారెడ్డి కలెక్టర్లు తీరుపై జనాల గుస్సా..
- తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరగనుందా?
- వివిధ పార్టీల నుండి బీజేపీ లోకి భారీ చేరికలు..
- నగరంలో మరోసారి ఈడీ సోదాలు….
- ఖమ్మం జిల్లాలో దారుణం… లిఫ్ట్ అడిగి విషపు ఇంజెక్షన్ ఇచ్చి హత్య
One Comment