
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : మునుగోడు ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. రానున్న ఎన్నికలకు సెమీఫైనల్స్ లాంటి మునుగోడు ఉప ఎన్నికలో గెలవాలనే లక్ష్యంతో ఆ పార్టీ ముందుకు సాగుతోంది. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటికే దిశా నిర్దేశం చేసిన నేపథ్యంలో.. ఓటర్ల కాళ్లు మొక్కేందుకు టీపీసీసీ నేతలు సిద్ధమయ్యారు.
Read Also : తెలంగాణ ఇలాగే అప్రతిహతంగా విజయపథంలో దూసుకుపోవాలి… సిఎం కేసిఆర్
గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 నుంచి మునుగోడులో పాదాభివందనం ఉంటుందని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. మునుగోడు ఓటర్లకు పాదాభివందనం చేసే కార్యక్రమం విద్యార్థులతో చేపడుతున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. మునుగోడు ఎన్నికల ప్రచారంలో ఎన్ఎస్యూఐ పనిచేడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. విద్యార్థి నాయకులను దండు కట్టి మునుగోడు ప్రజల వద్దకు పంపుతున్నామని… ఓటర్లు పెద్దవాళ్లు, ఎన్ఎస్యూఐ నేతలు చిన్నవాళ్లు కాబట్టి కాళ్లు మొక్కి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని వేడుకుంటారని రేవంత్ వివరించారు.
Also Read : పురుగు కుడితే ప్రాణాలు పోతాయంటూ ప్రచారం…. అవాస్తవమని తెలిపిన ఏపీ శాస్త్రవేత్తలు
లక్ష మంది ఓటర్ల కాళ్లు పట్టుకుని ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని కోరతామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలందరూ పాల్గొంటారని టీపీసీసీ ప్రెసిడెంట్ స్పష్టం చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు డబ్బుతో రాజకీయం చేస్తున్నాయంటూ రేవంత్ మండిపడ్డారు. రాజకీయాలంటే కొనుగోలు, అమ్మకాలుగా మారాయని, సంతలో కొనుగోలు చేసినట్లు ఆ రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also : విమోచన దినోత్సవం నిర్వహించేందుకు అన్ని పార్టీలు భయపడ్డాయి… అమిత్ షా
నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు ఐదు తరలు దేశం కోసం పనిచేస్తున్నాయని.. గాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిందని గుర్తు చేశారు. ప్రశ్నించే గొంతుకు ఓటు వేయాలని మునుగోడు ప్రజలను వేడుకుంటామని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతిని గెలిపించి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని కోరారు. పాదాభివందనం కార్యక్రమంలో మోదీ, కేసీఆర్కు దిమ్మతిరుగుతుందని రేవంత్ రెడ్డి అన్నారు.
ఇవి కూడా చదవండి :
- బిజేపికి వ్యతిరేకంగా పరేడ్ గ్రౌండ్స్ వద్ద ఫ్లెక్సిల కలకలం….
- విద్యార్థులకు కుళ్లిపోయిన భోజనం.. సమైక్యత వేడుకల్లో దారుణం
- సెప్టెంబర్ 17న కేసీఆర్ సంచలన ప్రకటన?
- తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొత్త లొల్లి…. రేవంత్ వ్యాక్యలపై సీనియర్లు సీరియస్
One Comment