Telangana

మృతులకు కేంద్రం రెండు లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం మూడు లక్షల పరిహారం….

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : సికింద్రాబాదులోని ఎలక్ట్రిక్ బైక్ షో రూమ్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ఇప్పటివరకు ఎనిమిది మంది మృత్యువాత పడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎలక్ట్రిక్ బైక్స్ షోరూంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో పైన ఉన్న హోటల్ లోకి మంటలు వ్యాప్తి చెందటంతో దట్టమైన పొగ కారణంగా అందులో బస చేసిన పర్యాటకులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేయగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలను చేపట్టింది. ప్రధాని నరేంద్ర మోడీ మృతుల కుటుంబాలకు 2 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. వారి కుటుంబాలకు సంతాపం తెలియజేశారు.

Read Also : కేసిఆర్ సవాలుకు బండి సంజయ్ ప్రతిసవాల్

తెలంగాణలోని సికింద్రాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం బాధాకరం అని పేర్కొన్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పిఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుండి 2 లక్షలు రూ మరణించిన వారి కుటుంబాలకు ఇస్తామని తెలిపారు. ఈ అగ్ని ప్రమాద ఘటనలో గాయపడిన వారికి 50,000రూపాయలు ఇస్తామని మోడీ ప్రకటించారు. మరోవైపు ఈ ప్రమాద ఘటనపై తెలంగాణా ప్రభుత్వం సైతం స్పందించింది. మరోవైపు ఈ ప్రమాద ఘటనపై తెలంగాణా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. చనిపోయిన ఎనిమిది మందిలో నలుగురిని ఇప్పటివరకు గుర్తించారు. తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, ఢిల్లీకి చెందిన ముగ్గురి వివరాలను గుర్తించినట్లుగా నార్త్ జోన్ డిసిపి చందనా దీప్తి తెలిపారు. ఇదిలా ఉంటే ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున మూడు లక్షల పరిహారం ప్రకటించారు మంత్రి కేటీఆర్.

 

Also Read : బిజేపిని చూసి కేసిఆర్ భయపడుతున్నాడు.. అందుకే మోడిపై విమర్శలు.. ఈటల రాజేందర్

సికింద్రాబాద్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటన పై మంత్రి కేటీఆర్ తో పాటు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. బిల్డింగ్ ప్లాన్ ను మిస్ యూస్ చేశారని మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు . అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే మంటలు త్వరగా వ్యాపించాయని 8 మంది పొగ కారణంగానే చనిపోయారు అంటూ తెలిపారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని పేర్కొన్న మహమూద్ అలీ క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నారని చెప్పారు . మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మూడు లక్షల పరిహారం అందిస్తున్నామని తెలిపారు. ఇక ఎలక్ట్రిక్ బైక్ షోరూం నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి : 

  1. హామీల అమలులో తెలంగాణకు అన్యాయం చేశారు… సీఎం కేసీఆర్
  2. కనకమామిడి ఫామ్‌హౌస్‌లో కృష్ణంరాజు అంత్యక్రియలు….
  3. తమ్ముడి గెలుపు కోసం అన్న ఆరాటం… త్వరలో బి‌జే‌పిలోకి వెంకట్ రెడ్డి
  4. కోమటిరెడ్డికి షాకుల మీద షాకులు.. బీజేపీ పెద్దలకు మునుగోడు టెన్షన్
  5. వైసీపీ అభ్యర్థిగా హీరో నాగార్జున? పోటీ ఎక్కడి నుంచో తెలుసా?

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.