Telangana

మంత్రి కేటిఆర్ తో విఆర్ఏల చర్చలు.. వారం రోజులు వేచి చూడాలన్న కేటిఆర్

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : మంగళవారం నాడు వీఆర్‌ఏలు సహా 7 సంఘాలు చేపట్టిన అసెంబ్లీ ముట్టడితో హైదరాబాద్ నగరం ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. వీఆర్‌ఏలు, కాంగ్రెస్‌ మత్స్యకార విభాగం, ఉపాధ్యాయ సంఘాలు, రెడ్డి సంఘం నేతలు విడతల వారీగా అసెంబ్లీ వద్దకు ముట్టడికి వచ్చారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుని పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. వెంటనే మంత్రి కేటిఆర్ విఆర్ఏలతో చర్చలు నిర్వహించారు.

Read Also : వజ్రోత్సవ మహాసభ విజయవంతం చేయాలి

మంత్రితో చర్చల అనంతరం వీఆర్‌ఏలు కాస్త వెనక్కి తగ్గారు. తమకు కేటీఆర్‌పై నమ్మకం ఉందని చెప్పారు. ఆయన సూచన మేరకు వారం రోజుల పాటు వేచి చూస్తామని ప్రకటించారు. అయితే, సమ్మె పూర్తిగా విరమించకుండా నిరసన శిబిరాల్లో శాంతియుతంగా కొనసాగిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు తమకు పే స్కేల్‌ పెంచాలనేది వీఆర్‌ఏల ప్రధాన డిమాండ్. ఇప్పటికే ఈ హామీ నెరవేర్చి ఉంటే తమ కేడర్ జూనియర్ అసిస్టెంట్ స్థాయికి చేరుకునేదని చెప్పారు. జీతాల చాలక తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read : ఉద్రిక్తంగా మారిన విఆర్ఏల అసెంబ్లీ ముట్టడి……

పరిస్థితి అదుపు తప్పుతుండటంతో ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వం తరఫున మంత్రి కేటీఆర్.. వీఆర్‌ఏలను చర్చలకు పిలిచారు. జేఏసీ నుంచి 15 మంది ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌తో చర్చలు జరిపారు. బయటకి వచ్చిన తర్వాత తమలో తాము చర్చించుకొని మీడియాతో మాట్లాడారు. ‘మాకు ఎవరి మీదా కోపం లేదు. ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటే చాలు. శాంతియుతంగా నిరసన కొనసాగిస్తున్నాం. మాకు ఏ రాజకీయ పార్టీల అండ లేదు. కేటీఆర్‌పై నమ్మకం ఉంది. సమస్య పరిష్కరిస్తామని, న్యాయం చేస్తామని.. ఈ నెల 18 వరకు వేచి చూడాలని మంత్రి కేటీఆర్ కోరారు. మాకు ఆయన మీద నమ్మకం ఉంది. అప్పటివరకూ నిరసన శిబిరాల వద్ద శాంతియుతంగా ఆందోళన కొనసాగిస్తాం’ అని వీఆర్‌ఏల జేఏసీ ప్రతినిధులు చెప్పారు.

Read Also : ఈటల సస్పెన్షన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన బండి సంజయ్….

‘పే స్కేల్‌ పెంపునకు సంబంధించిన జీఏ చూశాకే సమ్మె విరమిద్దాం అనుకున్నాం. అయితే, అసెంబ్లీలో ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ప్రకటన చేశారు. ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది. ఇచ్చిన హామీ ప్రకారం.. 23 వేల మంది వీఆర్‌ఏలకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని భావిస్తున్నాం’ అని జేఏసీ ప్రతినిధులు చెప్పారు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ వీఆర్‌ఏలు గత 50 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : 

  1. చిన్నారులపైకి దూసుకెళ్లిన స్కూల్ బస్.. ఒకరు మృతి, మరొకరికి గాయాలు
  2. ఈటల రాజేందర్ పై వేటు.. సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తూ ఆదేశాలు
  3. బిజేపిని చూసి కేసిఆర్ భయపడుతున్నాడు.. అందుకే మోడిపై విమర్శలు.. ఈటల రాజేందర్
  4. హామీల అమలులో తెలంగాణకు అన్యాయం చేశారు… సీఎం కేసీఆర్

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.