Telangana

ఉద్రిక్తంగా మారిన విఆర్ఏల అసెంబ్లీ ముట్టడి……

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : సోమవారం నాడు అసెంబ్లీలో విఆర్ఏలపై ముఖ్యమంత్రి కేసిఆర్ చేసిన వ్యాక్యలపై ఆగ్రహానికి గురైన విఆర్ఏలు మంగళవారం నాడు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపు నిచ్చారు. అసెంబ్లీ ముట్టడికి వచ్చిన వందలాది మంది వీఆర్ఏలను పోలీసులు ఎక్కడికక్కడు అరెస్టులు చేశారు. అసెంబ్లీ ముట్టడించేందుకు వీఆర్ఏ ఉద్యోగులు వస్తున్నట్లుగా సమాచారం రావడంతో వెంటనే పోలీసులు ముందుగానే అప్రమత్తమయ్యారు.

Read Also : ఈటల సస్పెన్షన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన బండి సంజయ్….

అసెంబ్లీ నుంచి ప్రగతి భవన్ వరకు భారీ ఎత్తున బలగాలు మోహరించారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న రోడ్లు మొత్తం బ్లాక్ చేశారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నాంపల్లి నుంచి అసెంబ్లీ వైపు వెళ్లే వాహనాలను దారి మళ్ళించారు. గత అసెంబ్లీ సమావేశంలో పే స్కేల్ ప్రకారం జీతం ఇస్తామని చెప్పిన కేసీఆర్ మాట తప్పారంటూ వారు ఆరోపిస్తున్నారు. పే స్కేల్ విధానం లేకుండా ఇస్తున్న జీతం కుటుంబాన్ని పోషించేందుకు సరిపోవడం లేదని.. నెలకు రూ.12వేల లోపు జీతంతో భార్యబిడ్డలను ఎలా పోషించాలని నిలదీస్తున్నారు. వీఆర్ఏలను ఇతర శాఖల్లో భర్తీ చేస్తామని కేసీఆర హామీ ఇచ్చారని.. కానీ ఇంతవరకు ఆ ప్రక్రియ మొదలుపెట్టలేదని తెలిపారు. అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన వీఆర్ఏలు కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

Also Read : చిన్నారులపైకి దూసుకెళ్లిన స్కూల్ బస్.. ఒకరు మృతి, మరొకరికి గాయాలు

వందలాదిగా తరలివచ్చిన ఉద్యోగులను నిలువరించడం పోలీసులకు కష్టంగా మారింది. ఈ క్రమంలో ఇందిరా పార్క్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్ దగ్గరి నుంచి పెద్దయెత్తున వస్తున్న 200 మంది వీఆర్ఏలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే ఈ కార్యక్రమం ముసుగులో ఎలాంటి అవాంఛనీ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. అయితే ఈ ఘటనల నేపథ్యంలో అసెంబ్లీ సమీప ప్రాంతాల్లో షాపులు మూసివేయాలని ఆదేశాలు జారీచేయడంతో వ్యాపారులు మండిపడుతున్నారు. పోలీసుల ఓవరాక్షన్‌పై సోషల్‌మీడియాలో నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ఇన్ని చర్యలు తీసుకునే బదులు వీఆర్ఏల సమస్యలు పరిష్కరిస్తే సరిపోతుంది కదా.. అని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : 

  1. ఈటల రాజేందర్ పై వేటు.. సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తూ ఆదేశాలు
  2. మృతులకు కేంద్రం రెండు లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం మూడు లక్షల పరిహారం….
  3. కేసిఆర్ సవాలుకు బండి సంజయ్ ప్రతిసవాల్
  4. బిజేపిని చూసి కేసిఆర్ భయపడుతున్నాడు.. అందుకే మోడిపై విమర్శలు.. ఈటల రాజేందర్
  5. హామీల అమలులో తెలంగాణకు అన్యాయం చేశారు… సీఎం కేసీఆర్

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.