
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుండి కేంద్రంలోని బీజేపీ సర్కార్ రాష్ట్రానికి అన్యాయం చేస్తూనే వస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం సభకు హాజరైన సీఎం కేసీఆర్ కేంద్ర విద్యుత్ బిల్లుపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ప్రసంగించారు. విభజ చట్టంలోని అనేక అంశాల్లో తెలంగాణకు కేంద్రం అన్యాయం చేసిందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఒక్క ఆర్డినెన్స్తో తెలంగాణకు చెందిన ఏడు మండలాలను లాగేసుకుందని మండిపడ్డారు.
Read Also : కనకమామిడి ఫామ్హౌస్లో కృష్ణంరాజు అంత్యక్రియలు….
సీలేరు పవర్ ప్లాంట్నూ లాక్కున్నారని, ఆ సమయంలో ప్రధానిని తానొక్కడినే వ్యతిరేకించానని తెలిపారు. ఎదుటివాళ్లు చెబితే వినే సంస్కారం బీజేపీ నేతలకు లేదన్నారు. కేంద్రం ఇచ్చిన గెజిట్లో మోటర్లకు మీటర్లు పెట్టాలని ఉందని కేసీఆర్ తెలిపారు. మీటర్లు లేకుండా ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వొదని బిల్లులో చెప్పారన్నారు. విద్యుత్ సంస్కరణల ముసుగుతో రైతులను దోచుకునే ప్రయత్నం జరుగుతోందని,. కేంద్రం తెస్తున్న విద్యుత్ సంస్కరణ అందరికీ తెలియాల్సిన అవసరం ఉందన్నారు. విద్యుత్ బిల్లును బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎలా సమర్ధిస్తున్నారో ఆలోచించుకోవాలని, సభను తప్పుదోవ పట్టించే చర్యలు మానుకోవాలని ఆయన హితవు పలికారు.
Also Read : నేటి నుంచి బండి సంజయ్ నాల్గోవ విడత పాదయాత్ర…
పార్లమెంట్లో ప్రతిపక్ష సభ్యులపై మూక దాడులు చేస్తు, రాజ్యాంగాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కాలరాస్తున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్తు కోసం చాలా ఇబ్బందులు పడ్డామన్న కేసీఆర్.. ఆనాడు అనేక ప్రాంతాల్లో విద్యుదాఘాతంతో చాలామంది రైతులు చనిపోయారని గుర్తు చేశారు. విద్యుత్ రంగం సహా అనేక సమస్యలపై పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో పునర్విభజన హామీల అమలులో తెలంగాణకు అన్యాయం చేశారని మండిపడ్డారు. నరేంద్ర మోదీ మోస్ట్ ఫాసిస్ట్ ప్రధాని అంటూ విమర్శలు గుప్పించారు. ఏపీలోని శ్రీకాకుళంలో మీటర్ల పెడితే రైతులు ఆందోళన చేశారని ఆయన తెలిపారు. కేంద్రం విధానాలపై యూపీ సహా అన్ని రాష్ట్రాల్లో వ్యతిరేకత వస్తోందని, సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందని, ఇది రాచరికం కాదని ప్రజాస్వామ్యంలో అధికారం అంటే బాధ్యత ఉంటుందన్నారు. రాష్ట్రాలకు ఏమాత్రం చెప్పకుండా, కనీసం చర్చ జరగకుండా విద్యుత్ బిల్లు తీసుకొచ్చిందని మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి :
- దేశవ్యాప్తంగా ఎన్ఐఏ దాడులు… ఏకకాలంలో 50 చోట్ల
- వినాయక మండపాలను సందర్శించిన కూసుకుంట్ల.
- ప్రజల శ్రేయస్సే ముఖ్యం… విభేదాలు అనవసరం….. గవర్నర్ తమిళసై
- వైసీపీ అభ్యర్థిగా హీరో నాగార్జున? పోటీ ఎక్కడి నుంచో తెలుసా?
- తమ్ముడి గెలుపు కోసం అన్న ఆరాటం… త్వరలో బిజేపిలోకి వెంకట్ రెడ్డి