Telangana

కనకమామిడి ఫామ్‌హౌస్‌లో కృష్ణంరాజు అంత్యక్రియలు….

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్యం కారణంగా ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం కృష్ణంరాజు భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి తరలించగా.. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు సందర్శించి నివాళులు అర్పించారు. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత కృష్ణంరాజు అంత్యక్రియలు నిర్వహిస్తారు. కృష్ణంరాజు అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ విషయమై చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్‌కు సీఎం కేసీఆర్ ఆదివారమే ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మంత్రి కేటీఆర్ కృష్ణంరాజు నివాసానికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.

Read Also : నేటి నుంచి బండి సంజయ్ నాల్గోవ విడత పాదయాత్ర…

కృష్ణంరాజు అంత్యక్రియలను ఆదివారం మధ్యాహ్నం మహాప్రస్థానంలో నిర్వహిస్తారని తొలుత వార్తలొచ్చాయి. అభిమానుల సందర్శనార్థం యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్క రెడ్డి స్టేడియంలో ఆయన భౌతిక కాయాన్ని ఉంచుతారని కూడా ప్రచారం జరిగింది. కానీ మొయినాబాద్ సమీపంలోని కనక మామిడిలో ఉన్న ఫామ్‌హౌస్‌లో కృష్ణంరాజు అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు తెలిపారు. ఉదయం 11.30 గంటలకు కృష్ణంరాజు పార్థీవదేహం అంతిమయాత్ర ప్రారంభం కానుండగా.. మధ్యాహ్నం 1 గంట సమయంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. కృష్ణంరాజు కనకమామిడిలో ఐదేళ్ల క్రితం వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేశారు. ఇక్కడ నివాసం ఉండటం కోసం ఓ ఫామ్ హౌస్‌ను నిర్మిస్తున్నారు.

Also Read : దేశవ్యాప్తంగా ఎన్ఐఏ దాడులు… ఏకకాలంలో 50 చోట్ల

కానీ అది పూర్తి కాక ముందే ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో ముందుగా అనుకున్నట్లు మహాప్రస్థానంలో కాకుండా ఇక్కడే ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. కృష్ణంరాజుకు ముగ్గురు కుమార్తెలు కాగా.. ఒక కుమార్తె విదేశాల్లో ఉంటున్నారు. ఆమె రావాల్సి ఉండటంతో.. సోమవారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. కృష్ణంరాజు మరణం పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలతోపాటు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ప్రభాస్‌ను ఫోన్లో పరామర్శించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

ఇవి కూడా చదవండి : 

  1. వినాయక మండపాలను సందర్శించిన కూసుకుంట్ల.
  2. సి‌పి‌ఐ రాష్ట్ర నూతన కార్యదర్శిగా సాంబశివరావు…..
  3. తమ్ముడి గెలుపు కోసం అన్న ఆరాటం… త్వరలో బి‌జే‌పిలోకి వెంకట్ రెడ్డి
  4. వైసీపీ అభ్యర్థిగా హీరో నాగార్జున? పోటీ ఎక్కడి నుంచో తెలుసా?
  5. మునుగోడుపై కేసీఆర్ లేటెస్ట్ సర్వే.. షాకింగ్ రిజల్ట్
ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.