
రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గురువారం ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్ధిపేట, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఈ మేరకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. శుక్రవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, ఖైరతాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, షాద్ నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. 10న ఆదిలాబాద్, కుమ్రంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్లల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది.
జనగాం, సిద్ధిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వానలు పడే అవకాశం ఉందని వివరించింది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. ఇదిలా ఉండగా.. ఇవాళ్టి ఉదయం వరకు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, జోగులాంబ గద్వాల, జనగాం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. పలుచోట్ల మోస్తరు వర్షాపాతం నమోదైంది. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా దండుమైలారంలో 13.4 సెంటీమీటర్లు, వికారాబాద్ జిల్లా దుద్యాలలో 12.1 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైందని టీఎస్డీపీఎస్ తెలిపింది