Telangana

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కే‌సి‌ఆర్ ఆలయాలు నిర్మిస్తా….. కే‌సి‌ఆర్ అభిమాని

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : భారతదేశంలో కేవలం బాలీవుడ్ మరియు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్‌లను మాత్రమే దేవుళ్లుగా చూస్తారని మీరు అనుకుంటే పొరబాటే. భారతదేశం అత్యంత భావోద్వేగాన్ని, భావ వ్యక్తీకరణను కలిగిన దేశం. దైవం పట్ల తమ భక్తిని మరియు విశ్వాసాన్ని వ్యక్తీకరించడానికి ప్రజలు దేశవ్యాప్తంగా లక్షలాది దేవాలయాలను నిర్మించినప్పటికీ, తమ అభిమాన నటులపై, అభిమాన రాజకీయ నాయకులపై భక్తిని తెలియజేయటానికి కూడా ఆలయాలు నిర్మించి తమ భావోద్వేగాన్ని తెలియజేస్తుంటారు. ఇక అదే కోవలో తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ కు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు నిర్మించాలని నిర్ణయించారు.

Also Read : తగ్గేదేలే అంటే తాట తీస్తాం.. రౌడీషీటర్లకు సీఐ క్రాంతికుమార్ హెచ్చరిక..

ప్రజలు ఎప్పుడూ ప్రముఖ రాజకీయ నాయకులకు తమ ప్రేమను తెలియజేయడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఆ ప్రేమ వ్యక్తీకరణలో భాగంగా రాజకీయ నాయకులకు ఆలయాలను నిర్మిస్తున్న సాంప్రదాయం చాలా కాలంగా కొనసాగుతోంది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి గుడి కట్టి, తెలంగాణలోని కరీంనగర్‌లో ఆమె విగ్రహాన్ని స్థాపించారు ఒక అభిమాని. ప్రజలు ప్రతిరోజూ సోనియాగాంధీ గుడి వద్దకు వెళ్లి తమ ప్రార్థనలు చేయడానికి వీలుగా ఈ ఆలయం నిర్మించబడింది. కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాల క్రితం ఉన్న ఆదరణ లేకపోయినా, సోనియా గాంధీకి ఇప్పటికీ విధేయులు చాలా మంది ఉన్నారు అని చెప్పడానికి ఆ ఆలయమే నిదర్శనం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి భారీ సంఖ్యలో అభిమానులు ఉన్న విషయం తెలిసిందే.

Read Also : అడవుల్లో అలజడి – జల్లెడ పడుతున్న పోలీసులు      

దేశంలో మోడీ మేనియా కొనసాగుతుంది. ఆయన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందాడు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేరు మీద ఆలయాన్ని నిర్మించారు ఆయన అభిమానులు . ఇదొక్కటే కాదు ఉత్తరప్రదేశ్‌లో కూడా అభిమానులు మరో నరేంద్ర మోదీ గుడి కట్టారు. నేటికీ ఆయన అభిమానులు ఆయా గుడులలో మోడీకి పూజలు నిర్వహిస్తున్నారు. ఇక తమిళనాడు రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధ వ్యక్తులలో ఒకరైన దివంగత ఎంజీఆర్ నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా మూడుసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయనకు కూడా అభిమానులు ఆలయాన్ని నిర్మించారు. నేటికీ ఆయన అభిమానులు ఎం.జి.ఆర్ ఆలయాన్ని సందర్శిస్తారు.

Also Read : పరిగి టీఆర్ఎస్ లో వర్గ పోరు.. ఫోన్ లో పార్టీ నేతను బెదిరిందిన ఎమ్మెల్యే.. వైరల్ గా మారిన ఆడియా

ఇక ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలలో బిజెపి నాయకురాలిగా పనిచేస్తున్న కుష్బూ సుందర్ కు కూడా ఆమె అభిమానులు గుడి నిర్మించి పూజలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇదే కోవలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు రాష్ట్రవ్యాప్తంగా గుళ్ళు నిర్మిస్తానని ఓ అభిమాని సంచలన ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను దైవస్వరూపంగా భావించి గుళ్ళు నిర్మిస్తామని చెబుతున్నారు హైదరాబాద్ కు చెందిన శ్రీ షిరిడి సాయి బృందావనం పీఠం వ్యవస్థాపక చైర్మన్ కె.జె కిషోర్ కుమార్ . మొదట మేడ్చెల్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు గుడి మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఒక్కో గుడి నిర్మించాలని భావిస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ పోరాట యోధుడిగా, రాష్ట్ర సాధకుడుగా కెసిఆర్ ప్రజలకు గుర్తుండడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా గుడులు నిర్మిస్తామని ప్రకటించారు.

ఇవి కూడా చదవండి : 

  1. అయ్యప సొసైటీలో ఘనంగా గణేష్ శోభాయాత్ర
  2. బిగ్ బ్రేకింగ్… కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి
  3. మంగళవారం ప్రారంభం… సోమవారానికి వాయిదా
  4. గురుకులాల సమస్యలు పరిష్కరించు… తరువాత దేశ రాజకీయాలు

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.