
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్లోని చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ జ్యోతి నివాసంతో, హనుమకొండలో సామాజిక కార్యకర్త అనిత, ఏపీలోని కృష్ణా జిల్లా మైలవరంలోని చైతన్య మహిళా సంఘం కో కన్వీనర్ రాధ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోమవారం సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయమే వారి ఇళ్లలోకి ప్రవేశించిన ఎన్ఐఏ అధికారులు సమీపంలోకి ఎవరూ రాకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
Also Read : నేడు నిజామాబాద్ జిల్లా పర్యటనకు కేసిఆర్…
హనుమకొండలోని సుబేదారి పోలీస్స్టేషన్ పరిధిలో నివాసముండే అనిత చైతన్య మహిళా సంఘం సభ్యురాలిగా కొనసాగుతూ స్థానికంగా ఓ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. మూడురోజులుగా ఆమె కదలికలపై నిఘా పెట్టిన ఎన్ఐఏ అధికారులు ఆదివారం ఇంటికి వచ్చి ఆమెను ప్రశ్నించారు. సోమవారం తెల్లవారుజామున 5 గంటలకే ఆమె ఇంట్లో సోదాలు చేయడం ప్రారంభించారు. ఈ సోదాలకు సంబంధించి స్థానిక పోలీసులకు ముందస్తుగా ఎలాంటి సమాచారం అందలేదు. అయితే ఉదయం 10 గంటల సమయంలో సుబేదారి పోలీసులకు సమాచారం రావడంతోనే ఈ సోదాల విషయం బయటికి పొక్కింది.
Read Also : బండి సంజయ్ నాలుగో విడత పాదయాత్ర షడ్యూల్ ఖరారు….
అయితే ఏకకాలంలో హైదరాబాద్, హనుమకొండ, మైలవరం ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు చేస్తున్న వార్త వెలుగులోకి రావడంతో తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. చైతన్య మహిళా సంఘంలో కొనసాగుతున్న అనిత, రాధ, జ్యోతి నివాసాల్లో ఎన్ఐఏ ఎందుకు సోదాలు చేస్తోందన్న ప్రశ్న అందరిలో మొదలైంది. వారికి నిషేధిత ఉగ్రవాద సంస్థలతో గానీ, మావోయిస్టులతో గానీ సంబంధాలున్నాయా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే దీనిపై ఎన్ఐఏ నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదు. ఈ సోదాలు పూర్తయితే గానీ దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
ఇవి కూడా చదవండి :
- మునుగోడుపై కేసీఆర్ లేటెస్ట్ సర్వే.. షాకింగ్ రిజల్ట్
- అమ్ముడుపోయిన నేతలను ఉరికించి కొట్టండి.. మునుగోడు జనాలకు రేవంత్ రెడ్డి పిలుపు
- పంచాయితీ కార్యదర్శిపై నోరు పారేసుకున్న ఎంఎల్ఏ గాదరి కిషోర్…
- అమిత్ షా సభ రోజునే ఎంఐఎం తిరంగా యాత్ర.. సెప్టెంబర్ 17న ఏం జరగబోతోంది?
- వైన్ షాపుల్లో కేసీఆర్ బొమ్మ పెట్టాలట!
