
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకునేందుకు క్షేత్ర స్థాయిలో ప్రచారం ప్రారంభించింది. మునుగోడు సీటుపై ప్రియాంక గాంధీ స్పెషల్ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మన మునుగోడు-మన కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా నిన్నటి నుంచి పార్టీ కార్యకర్తలు గడప గడప కార్యక్రమం చేపట్టారు.
Read Also : ముఖ్యమంత్రి సారు మమ్ముల్ని ఆదుకోరూ… కండరాల క్షీణతతో మంచానికి పరిమితం
ఇవాళ టీఆర్ఎస్, బీజేపీపై కాంగ్రెస్ పార్టీ ఛార్జిషీట్ విడుదల చేయనుంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డితో పాటు పార్టీ కీలక నేతలు ఈరోజు మునుగోడుకు రానున్నారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక అడుగైన ఛార్జ్షీట్ విడుదల కార్యక్రమానికి భువనగిరి ఎంపీ కోమటరెడ్డి వెంకటరెడ్డి వస్తారా..? రారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పలు నాటకీయ పరిణామాల తర్వాత మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వస్తానని చెప్పిన కోమటరెడ్డి.. గతంలో దానికి కొన్ని కండీషన్స్ కూడా పెట్టారు. మరి ఈ నేపథ్యంలో ఇవాళ మునుగోడులో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నాయకత్వం హాజరయ్యే ఈ కార్యక్రమానికి కోమటరెడ్డి రాకపై ఆసక్తిగా మారింది.
Also Read : నేడు ముఖ్యమంత్రి కేసిఆర్ వరస సమావేశాలు… కీలక ప్రకటన ప్రకటించే అవకాశం..!!!
అయితే, ముంబయిలో జరిగిన బొగ్గు కమిటీ పార్లమెంటరీ స్థాయి సమావేశానికి హాజరయ్యేందుకు అక్కడికి వెళ్లిన కోమటరెడ్డి.. అటు నుంచి ఢిల్లీ వెళ్లారు. 4న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో దేశవ్యాప్త ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా పార్టీ ఆధ్వర్యంలో జరిగే ర్యాలీలో కూడా ఆయన పాల్గొననున్నారు. ఇంత బిజీ షెడ్యూల్లో ఇవాళ జరిగే కార్యక్రమానికి హాజరవుతారో లేదో వేచి చూడాలి మరి. మునుగోడులో రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు జరిగే కార్యక్రమానికి.. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నాయకులు జానారెడ్డి, దామోదర్ రెడ్డి, మధుయాష్కి పాల్గొననున్నారు.
ఇవి కూడా చదవండి :
- విడికేం పోయే కాలం…. పెన్షన్ సొమ్ము కోసం నాయనమ్మకు నరకం
- వైఎస్సార్ జిల్లాలో జగన్ రెండవ రోజు కొనసాగిన పర్యటన… తండ్రికి ఘననివాళి
- కుమారుడి జ్ఞాపకార్ధం ఉచిత పెట్రోల్ పంపిణీ… భారులు తీరిన వాహనదారులు
- అత్తింటి వేదింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య…
- దసరా తర్వాత అసెంబ్లీ రద్దు.. మునుగోడు బైపోల్ లేనట్టే?