National

నేడు మండల్ 104 జయంతి… బీసీలకు రిజర్వేషన్లను అందించిన ఘనత మండల్ దే

రాష్ట్రవ్యాప్తంగా మండల్ జయంతి వేడుకలను నిర్వహిద్దాం... శ్రీదర్ యాదవ్

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : నేడు భారత దేశంలో బీసీలు(OBCలు) సుమారు 3600 పైగా కులాలకు రిజర్వేషన్స్ అందుతున్నాయి అంటే బి,పి,మండల్ గారి చొరవ వారు ఇచ్చిన కమిషన్ నివేదిక నే అని చెప్పాలి. 1990 ఆగస్టు 7వ తేదీన అప్పటి ప్రధాని వీపీ సింగ్ గారు మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తున్నామని పార్లమెంట్ లో ప్రకటన చేశారు . అప్పటినుంచి బిందేశ్వరి ప్రసాద్ మండల్ (బీపీ మండల్ ) సిఫార్సుల మేరకు బీసీలకు రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. బీహార్ మాజీ ముఖ్యమంత్రి, హైకోర్టు జడ్జి భారతదేశ పార్లమెంటు సభ్యుడు, సంఘ సంస్కర్త, రెండవ వెనుకబడిన తరగతుల మండల్ కమీషన్ కు చైర్మన్ (మండల్ కమీషన్ చైర్మన్ గా సంచలనం సృష్టించిన వాడు).

Read Also : నేడు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రారంభించనున్న ముఖ్యమంత్రి..

ఉత్తర బీహార్ లోణి సహర్సా లో అత్యంత ధనికులైన యాదవ్ జమీందారీ (భూస్వాములు) కుటుంబం లో జన్మించారు. (భారత దేశంలో మొదటి ఓబీసీ కమిషన్ అప్పట్లో కాకా కాలేల్కర్ కమీషన్ భారతదేశంలోని ప్రజలలో ఒక భాగాన్ని “అదర్ బ్యాక్ వర్డ్ క్లాసెస్”(OBCs) (ఇతర వెనుకబడిన కులాలు) గా నివేదిక ప్రకారం నివేదించింది. భారతీయ రాజకీయాల్లో తక్కువగా ఉన్న, బలహీన వర్గాల కోసం పాలసీపై తీవ్రమైన చర్చ ప్రారంభమైంది, మొదటి ఓబీసీ కమిషన్ ఏమి తేల్చకుండా వదిలెయ్యడం తో రెండవ ఓబీసీ కమిషన్ బీపీ మండల్ గారి సారధ్యంలో ఐదుగురు సభ్యులతో అప్పటి జనతాపార్టీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం నియమించింది.

Also Read : రేవంత్ రెడ్డికి షాక్.. పాల్వాయి స్రవంతికే మునుగోడు టికెట్!

బి.పి. మండల్ జీవిత విశేషాలు

బి.పి. మండల్ ( బిందేశ్వరి ప్రసాద్ మండల్ ) బీహార్ లోని బనారస్ లోని యాదవ్ కుటుంబంలో 1918 ఆగస్టు 25న జన్మించాడు, మాధేపురా జిల్లాలోని మోరో గ్రామంలో పెరిగాడు. మండేపురంలో మండల్ తన ప్రాథమిక విద్యని , దర్భాంగాలో ఉన్నత పాఠశాల విద్యని పూర్తి చేసాడు. 1930 లో పాట్నా కాలేజీలో ఇంటర్మీడియేట్ పూర్తి చేసిండు. ఆ తరువాత పై చదువులకై అతను ప్రెసిడెన్సీ కళాశాల కలకత్తాలో చేరాడు. దురదృష్టవశాత్తు, ఇంట్లో కొన్ని అనివార్యమైన పరిస్థితుల కారణంగా, అతను తన చదువుని విడిచిపెట్టవలసి వచ్చింది.
మండల్ తన 23 వయేటా జిల్లా కౌన్సిల్ కి ఎన్నికయ్యాడు. 1945-51 మధ్య కాలములో మాధేపుర డివిజన్ లో జీతం తీసుకోకుండానే జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ గా పని చేసాడు. అతని రాజకీయ జీవితం భారత జాతీయ కాంగ్రెస్ తో మొదలైంది.

Read Also : దుకాణాలు బంద్.. హైదరాబాద్ పాతబస్తీలో హై టెన్షన్

1952 లో మొదటిసారి బీహార్ అసెంబ్లీకి శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు. అధికార పక్షములో ఉండి బీహార్ లోని బలహీనవర్గ కుర్మీలపై అగ్రవర్ణ రాజుపుత్రులు దాడి చేయడాన్ని నిరసించాడు. 1965 లో తన నియోజకవర్గంలో భాగంగా ఉన్న గ్రామమైన పామాలో మైనారిటీలు, దళితులపై పోలీసులు చేస్తున్న అత్యాచారాలపై మాట్లాడాలని కోరుకున్నప్పుడు అధికార పక్షములో ఉండి ఈ అంశంపై మాట్లాడకూడదని ముఖ్యమంత్రి ఆదేశిస్తే తన మనస్సాక్షిని చంపుకోలేక తను నమ్మిన విలువల కోసం ప్రతిపక్ష పాత్ర నిర్వహించడానికి సిద్దమై సంయుక్త సోషలిస్ట్ పార్టీ (ఎస్.ఎస్.పి) లో చేరాడు. ఎస్.ఎస్.పి రాష్ట్ర పార్లమెంటరీ బోర్డు ఛైర్మన్ గా నియమించబడ్డాడు.
1967 లో జరిగిన ఎన్నికలలో ఎస్.ఎస్.పి అభ్యర్ధుల ఎంపికపై ఆయన చేసిన కృషి, ఆయన ప్రచారం వల్ల 1962 లో కేవలం 7 సీట్లు గల ఆ పార్టీకి 1967 లో 69 సీట్లు వచ్చాయి. బీహార్లో మొట్టమొదటి కాంగ్రెస్ యేతర ప్రభుత్వం ఏర్పడింది. ఆయన పార్లమెంటు సభ్యుడు అయినప్పటికీ మంత్రివర్గంలో చేర్చారు.

Also Read : కమలం”జోరు”…. కాలీకానున్న కారు.

ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేసాడు. కానీ పార్టీలో, ప్రభుత్వములో కొన్ని విబేధాలు రావడముతో కాంగ్రెస్ పార్టీ బయటి నుండి మద్దతు ఇవ్వడంతో 1968 ఫిబ్రవరి 1 న అయన బీహార్ రాష్ట్ర రెండవ బీసీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించాడు. కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకుంటూనే రాజీ పడకుండా రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల అవినీతిపై అయ్యర్ కమీషన్ వేసి విచారణ చేయించాడు. ఆ కమీషన్ నివేదికను బయలుపరచకుండా అప్పటి ప్రధాని ఇందిరాగాంధి స్వయంగా ఒత్తిడి తీసుకవచ్చింది. ప్రధానితో అతను మాట్లాడడానికి నిరాకరించడముతో ప్రభుత్వముపై అవిశ్వాస తీర్మానం పెట్టి నెగ్గడంతో 30 రోజులకే మండల్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అతను తరచూ తన మంత్రులకు, “ఓట్లను సంపాదించడానికి కులపరమైన విజ్ఞప్తి సహించవచ్చు కానీ ప్రభుత్వాల నిర్ణయాలల్లో ఏ కులతత్వాన్ని సహించవద్దు” అని చెప్పే మండల్ తన ప్రభుత్వములో పరిపాలనలో ఎక్కడ కులతత్వాన్ని ప్రదర్శించకుండా పాలించాడు.

Read Also : ఫలించిన రాధమ్మ న్యాయ పోరాటం…

1967 మార్చి 5న అయన సోషిత్ దళ్ (అణగారిన ప్రజల పార్టీ ) ని స్థాపించాడు. 1967 నుండి 1970 వరకు లోక్‌సభ సభ్యునిగా ఉన్నాడు. 1972 లో శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు. 1972 లో అప్పటి బీహార్ ముఖ్య మంత్రి పాండే మిథిలా యూనివర్సిటీ పేరుతో అందులో కింది ఉద్యోగి నుండి వైస్ ఛాన్సలర్ వరకు ఒకే కులం వారితో నింపాలనే ప్రయత్నాలని వ్యతిరేకించాడు. ఆ తర్వాత 1974 లో శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేసి జయప్రకాష్ నారాయణ నేతృత్వములో నడుస్తున్న అవినీతి వ్యతిరేక ఉద్యమములో పాల్గొన్నాడు. 1977 లో జనతా పార్టీ తరపున లోక్ సభకి ఎన్నికై 1979 వరకు కొనసాగాడు. మండల్ తన రాజకీయ జీవితంలో సోషలిస్ట్ రాజకీయాల ఆలోచనపరుడిగా కొనసాగారు.

Also Read : ఈటల రాజేందర్ ఇంట విషాధం…

మండల్ కమీషన్

1978 డిసెంబరులో మొరార్జీ దేశాయ్ ఐదుగురు సభ్యులు గల పౌర హక్కుల కమీషన్ వేసాడు దీనికి బీపీ మండల్ గారు చైర్మన్ గా వ్యవహరించాడు. అతని కమిషన్ నివేదిక 1980 డిసెంబర్ 31 లో పూర్తయింది. అన్ని ప్రభుత్వ, విద్యా సంస్థలలో ఇతర వెనుకబడిన తరగతుల (ఒ.బి.సి) అభ్యర్థులకు రిజర్వు సీట్లను 33%నుంచి50% వరకు నిష్పత్తి ప్రకారం కేటాయించాలని సిపారసు చేసాడు. కమిషన్ నివేదిక ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పరిశీలనలోకి వచ్చింది. కానీ అమలు జరగలేదు. ఒక దశాబ్దం తరువాత ప్రధానమంత్రి విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ ఈ సిఫార్సులను ఆమోదించాడు.

Read Also : చెల్లమల్లకే మునుగోడు కాంగ్రెస్ టికెట్…?

మండల్ కమిషన్ 43 సిఫారసులను ఆమోదిస్తే వాటిలో కేవలం మూడింటిని మాత్రమే ప్రభుత్వాలు అమలు చేస్తున్నా యి,దేశంలో అన్ని పార్టీలు మండల్ కమిషన్ తరువాతనే బీసీలు జపం చేస్తున్నాయి అనిచెప్పవచ్చు కానీ వారి ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే అనేది విమర్శ ఉంది, బిపి మండల్ గారు, 1982 ఏప్రిల్ 13 న మరణించారు భారత ప్రభుత్వం 2001లో అతని గౌరవార్థం ఒక పోస్టల్ స్టాంపును విడుదలచేసింది. 2007లో స్థాపించబడిన ఒక కళాశాల “బి.పి.మండల్ ఇంజనీరింగ్ కళాశాల” అని నామకరణం చేసారు. బీపీ మండల్ గారి సంకల్పం నెరవేరాలంటే బీసీ ఐక్య పోరాటాలకు నడుం కట్టినప్పుడే బీపీ మండల్ గారికి నిజంగా మనం (ఓబీసీలు,బీసీ ) నిజమైన నివాళులు అర్పించినట్లు అవుతుంది.

బీసీ లందరికీ మండల్ జయంతి శుభాకాంక్షలు

బీసీ రిజర్వేషన్ల సాధనకు కృషిచేసిన మహానీయుడైన బీపీ మండల్ జయంతి వేడుకలను బీసీలంతా ఒక పండుగ మాదిరిగా నిర్వహించుకుందామని బీసీ రాజ్యాధికార సాధన సమితి కన్వీనర్ బద్దుల శ్రీధర్ యాదవ్ అన్నారు. ఈరోజు బీసీలు రిజర్వేషన్ ఫలాలను అనుభవిస్తున్నారంటే దానికి ముఖ్య కారణం బిపి మండల్ అని ఆయన పేర్కొన్నారు. బీపీ మండల్ జయంతి సందర్భంగా బీసీ సామాజిక వర్గ ప్రజలందరికీ బద్దుల శ్రీధర్ యాదవ్ శుభాకాంక్షలు తెలియజేశారు.

sridar - Crime Mirror

ఇవి కూడా చదవండి : 

  1. ఫీనిక్స్ సంస్థలో ఐటీ సోదాలు.. అసలు టార్గెట్ కేటీఆరేనా?
  2. బీజేపీ నుంచి రాజాసింగ్ సస్పెండ్… విద్వేష కామెంట్ల కేసులో చంచల్ గూడ జైలుకు తరలింపు
  3. ఇవిగో మా ఓట్లు … సీటు ఎందుకు ఇవ్వరు ?! ప్రధాన పార్టీలు సామాజిక న్యాయం పాటించాలి
  4. తెరాస లో బిసి గళం… మునుగోడు టికెట్ బీసీలకే ఇవ్వాలన్న బూర నర్సయ్య
  5. జిల్లాల పర్యటనకు సి‌ఎం కే‌సి‌ఆర్ గ్రీన్ సిగ్నల్..!!!

ad 728x120 SRI swami - Crime Mirror

Show More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Continue in browser
Crime Mirror
To install tap
and choose
Add to Home Screen
Continue in browser
Crime Mirror
To install tap Add to Home Screen
Add to Home Screen
Crime Mirror
To install tap
and choose
Add to Home Screen
Continue in browser
Crime Mirror
To install tap
and choose
Add to Home Screen
Continue in browser
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.