
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : బిజేపి ఎంఎల్ఏ ఈటల రాజేందర్ ఇంట విషాధం నెలకొంది. రాజేందర్ తండ్రి ఈటల మల్లయ్య మంగళవారం రాత్రి కన్నుమూశారు. గత కొద్ది రోజుల నుండి అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. ఆయనను హైద్రాబాద్ లోని ఆర్వీఎం ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో మంగళవారం రాత్రి ఆయన కన్నుమూశారు. మల్లయ్య మరణవార్తను ఈటల రాజేందర్ కుటుంబ సభ్యులు ధృవీకరించారు. మంగళవారం అర్ధరాత్రి ఆయన భౌతిక కాయాన్ని హనుమకొండ జిల్లా కమలాపూర్లని ఈటల స్వగృహానికి తరలించారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల సమయంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఈటల కుటుంబీకులు తెలిపారు. ఈటల మల్లయ్యకు మొత్తం ఎనిమిది మంది సంతానం. ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రెండో కుమారుడు. ఈటల మల్లయ్య మృతితో కమలాపూర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మల్లయ్యను కడసారి చూసేందుకు.. ఈటలను పరామర్శించేందుకు బీజేపీ కార్యకర్తలు తరలి వస్తున్నారు.
Read Also : చెల్లమల్లకే మునుగోడు కాంగ్రెస్ టికెట్…?
మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో ఈటల రాజేందర్ బిజీబిజీగా ఉన్నారు. కొన్ని రోజులుగా మునుగోడు నియోజకవర్గంలోనే మకాం వేసి క్షేత్ర స్థాయిలో పరిస్థితులను సమీక్షిస్తున్నారు. బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ హోదాలో వలసలపై సీరియస్గా దృష్టిసారించారు. కలిసి వచ్చే వారందరినీ పార్టీలో చేర్చుకుంటున్నారు. ఈటల రాజేందర్ భార్య జమున స్వగ్రామం మునుగోడు నియోజకవర్గంలోనే ఉండడంతో ఆయన అక్కడే స్వయంగా అక్కడే ఉండి.. ఉపఎన్నికల కోసం పనిచేస్తున్నారు. ఐతే తండ్రి ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో మంగళవారం అంతా ఆయన ఆస్పత్రిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. రాత్రి తన తండ్రి మరణించడంతో స్వగ్రామానికి వెళ్లిపోయారు. అంత్యక్రియలు నుంచి దశదిన కర్మ వరకు అక్కడే ఉండనున్నారు. ఆ తర్వాతే మళ్లీ రాజకీయపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి :
- మీడియా రంగంలోకి అదానీ గ్రూప్.. NDTVని దక్కించుకునేందుకు భారీ డీల్
- ఫీనిక్స్ సంస్థలో ఐటీ సోదాలు.. అసలు టార్గెట్ కేటీఆరేనా?
- బీజేపీ నుంచి రాజాసింగ్ సస్పెండ్… విద్వేష కామెంట్ల కేసులో చంచల్ గూడ జైలుకు తరలింపు
- ఇవిగో మా ఓట్లు … సీటు ఎందుకు ఇవ్వరు ?! ప్రధాన పార్టీలు సామాజిక న్యాయం పాటించాలి
- రేవంత్ రెడ్డి తో వేదిక పంచుకోలేను.. సోనియాకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ