
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : గులాబీ బాస్ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి ఎదురు నిలిచే పార్టీ లేదని నిన్నమొన్నటిదాకా ధీమా వ్యక్తం చేస్తే తాజా పరిణామాలు తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధినేతను అలెర్ట్ అవ్వాలని సూచిస్తున్నాయి. అందుకే కేసీఆర్ జిల్లాల అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నారు. ప్రజా క్షేత్రంలో ప్రజల మద్దతు పొందటంతో పాటు, వివిధ జిల్లాలలో పర్యటిస్తూ అటు పార్టీని ప్రక్షాళన చెయ్యాలని కూడా చూస్తున్నారని సమాచారం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రాష్ట్రంలోని జిల్లాల్లో పర్యటించనున్నారు. వచ్చే ఎన్నికల నేపధ్యంలో ఇప్పటి నుండే ప్రజా క్షేత్రంలో కేసీఆర్ యాక్టివ్ గా తిరగాలని భావిస్తున్నట్టు సమాచారం.
Read Also : కేసిఆర్ కు ట్విటర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి…
కేసీఆర్ జిల్లాలలో పర్యటించాలని యోచిస్తున్న నేపథ్యంలో రాజకీయ రసవత్తరంగా మారనుంది. సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన నేపథ్యంలో అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికీ వికారాబాద్, మేడ్చల్ జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్ ప్రస్తుతం మళ్లీ రంగారెడ్డి, పెద్దపల్లి, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో పర్యటించనున్నట్లు గా తెలుస్తుంది. వికారాబాద్, మేడ్చల్ జిల్లాలలో సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్, ఇప్పుడు రంగారెడ్డి, పెద్దపల్లి, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలలోనూ సమీకృత కలెక్టరేట్ కాంప్లెక్స్లను ప్రారంభిస్తారని తాజా సమాచారం. రంగారెడ్డి కలెక్టరేట్ ను ఆగస్టు 25వ తేదీన సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
పెద్దపల్లి కలెక్టరేట్ భవనాన్ని ఆగస్టు 29వ తేదీన ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 5వ తేదీన నిజామాబాద్ కలెక్టరేట్ భవనాన్ని, సెప్టెంబర్ 10న జగిత్యాల కలెక్టరేట్లను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ కలెక్టరేట్ భవనాలను జాతికి అంకితం చేయనున్నారు. జిల్లాల పునర్విభజన తరువాత తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జిల్లాల లోని సమీకృత కలెక్టరేట్ ల నిర్మాణాన్ని చేపట్టింది. ఇప్పటికే అనేక జిల్లాలలో కొత్త కలెక్టరేట్ లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఇటీవలే వికారాబాద్, మేడ్చల్ జిల్లాలో సమీకృత కలెక్టరేట్ లను ప్రారంభించిన సీఎం కేసీఆర్ అక్కడ ఏర్పాటుచేసిన సభలలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, ప్రజలకు చెప్పడం తో పాటు కేంద్రంలోని బిజెపి ని టార్గెట్ చేసే విమర్శలు గుప్పించారు.
Also Read : మునుగోడుపై ప్రియాంక గాంధీ ఫోకస్… నేడు డిల్లీలో నేతలతో కీలక భేటీ..
ఇక ఇప్పుడు కూడా సీఎం కేసీఆర్ ప్రతి జిల్లాలోనూ సమీకృత కలెక్టరేట్ భవనాలను ప్రారంభించడంతో పాటు ప్రతి జిల్లా నుండి ముఖ్యమైన నాయకులను కలుసుకుంటారు . తన పర్యటనలో ప్రతి జిల్లా అభివృద్ధిపై దృష్టి పెడతారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం కావడానికి కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తుంది. ప్రజాక్షేత్రంలోకి వెళితేనే ప్రజల ఆలోచన విధానం ఏ విధంగా ఉంది?టిఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది?
ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి ఏం చేయాలి? ప్రతిపక్షాల బలం ఏంటి? నిత్యం ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఏ విధంగా చెక్ పెట్టాలి? పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి? అనేవి తెలుస్తాయని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారని ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఏదేమైనా సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం భవిష్యత్ ఎన్నికలను ఉద్దేశించే అన్న చర్చ జరుగుతుంది .
ఇవి కూడా చదవండి :
- అమిత్ షా సభతో బీజేపీలో జోష్…. బిసి అభ్యర్ది ఎంపికపైనే కేసిఆర్ దృష్టి ??
- కమ్యూనిస్టుల పేపర్ ను కేసీఆర్ ఆక్రమించారు… అయినా మద్దతు ఇస్తారా! మునుగోడు సభలో ఈటల రాజేందర్ ఫైర్
- దళిత కార్యకర్త ఇంటికి అమిత్ షా.. సాంబమూర్తి నగర్ వాసుల సంతోషం
- కార్యాయలంలోనే కొట్టుకున్న సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి.. ఎందుకో తెలుసా?
- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తా.. మునుగోడులో రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన