
నల్లగొండ నిఘా, ప్రతినిధి(క్రైమ్ మిర్రర్): గత కొంత కాలంగా అక్రమ గంజాయి రవాణా పైన నల్లగొండ జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపడంతో పాటు, అక్రమ గంజాయి నివారణ పైన నిరంతర నిఘా పెట్టి జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధిలలో 10 క్వింటాల్ల 48.355 కేజీల గంజాయిని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కోర్టు ఉత్తర్వుల మేరకు నార్కట్ పల్లి మండలం గుమ్మల బావి పోలీస్ ఫైరింగ్ రేంజ్ నందు జిల్లా యస్.పి మరియు డ్రగ్ డిస్పోజల్ కమిటీ అధ్వర్యంలో నిర్వీర్యం చేశారు.
Also Read : హైదరాబాద్ లో ఐటీ దాడుల కలకలం.. నెక్స్ టార్గెట్ కేసీఆరేనా?
ఈ సందర్భంగా యస్.పి రెమా రాజేశ్వరి మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా 51 కేసులలో 1048.355 కిలోల గంజాయిని సీజ్ చేసి నిర్వీర్యం చేసామని, యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని, ఎవరైనా అక్రమ గంజాయి రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని, జిల్లా పోలీసులు నిరంతరం నిఘా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆశ్వాక్, ఎస్.బి డిఎస్పి రమేష్, నల్లగొండ డి.ఎస్పి నరసింహ రెడ్డి, మిర్యాలగూడ డి.ఎస్పి వెంకటేశ్వర రావు, డి.టి.సి డిఎస్పి వెంకటరమణ, ఆర్.ఐ కృష్ణా రావు,ఎస్ఐ వెంకటేశ్వర్లు, ఆర్.ఎస్.ఐ లు కళ్యాణ్,రాజీవ్ లు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
- అద్దాల్లా మెరవబోతున్న మునుగోడు రోడ్లు.. రాజగోపాల్ రెడ్డికి జై కొడుతున్న జనాలు
- తలకు రుమాలు కట్టి డైలాగులు చెప్తే సరిపోతుందా? ప్రధాని మోడీపై కేసీఆర్ సెటైర్లు..
- కోమటిరెడ్డికి హైకమాండ్ వార్నింగ్! నోరు మూసుకోవడమే బెటరట…
- మునుగోడులో కారు పంక్చరే! బీజేపీలో చేరిన టీఆర్ఎస్ ఎంపీపీ.. అదేబాటలో వందిమందికి పైగా సర్పంచ్ లు, ఎంపీటీసీలు
- మునుగోడులో మూడుసార్లు సీఎం బహిరంగ సభలు… ప్రతిష్టాత్మకంగా జనసమీకరణ
One Comment