
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ప్రజలకు ఉచితంగా వైద్యం అందించే ప్రక్రియలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీ – ఆయుష్మాన్ భారత్ పథకం కింద అందించే ఉచిత చికిత్సలకు ఆహార భద్రత కార్డును కూడా చెల్లుబాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో తెల్ల రేషన్ కార్డులున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చింది. అనంతర కాలంలో ప్రభుత్వం రేషన్ కోసం తెల్ల కార్డు స్థానంలో ఆహార భద్రత కార్డులు పంపిణీ చేసింది. వీటిని కేవలం రేషన్ కోసం మాత్రమే పరిమితం చేశారు.
Read Also : తమ్మినేని కృష్ణయ్య హత్యకేసులో ఆరుగురి అరెస్టు?
అయితే ఆరోగ్యశ్రీ – ఆయుష్మాన్ భారత్లో చికిత్సలు పొందాలంటే సంబంధిత కార్డులు, లేదా తెల్ల రేషన్ కార్డు అయినా ఉండాలనే నిబంధనలున్నాయి. గతంలోనే ప్రభుత్వం పంపిణీ చేసిన ఆరోగ్యశ్రీ కార్డులుతో రాష్ట్రవ్యాప్తంగా 77 లక్షల కుటుంబాలు ఉచిత వైద్యసేవలు పొందే అవకాశం దక్కింది. అయితే ఆహార భద్రతా కార్డుదారులకు మాత్రం ఆ అవకాశం లభించడం లేదు. వీరంతా అత్యవసర చికిత్స అవసరమైన సమయంలో ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ తిరిగి ఆమోదం పొందాల్సి వస్తోంది. దీనిపై ప్రజలను నుంచి తీవ్ర అభ్యంతరాలు వెల్లువెత్తడంతో ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ సమస్యపై సానుకూలంగా నిర్ణయం తీసుకుంది.
Also Read : సీజ్ చేసిన అక్రమ గంజాయిని నిర్వీర్యం చేసిన జిల్లా పోలీస్.
దీనిపై మంత్రి హరీశ్రావు స్పందిస్తూ.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ప్రభుత్వ రెండు విడతలుగా 10లక్షల కుటుంబాలకు ఆహార భద్రత కార్డులను పంపిణీ చేసిందని తెలిపారు. వీరికి ఆరోగ్యశ్రీ సేవలు లభించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న అంశం ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి వచ్చిందని, ఆయన సానుకూలంగా స్పందించి ఆహార భద్రత కార్డుదారులకు కూడా ఈ పథకం వర్తించేలా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఇకపై ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రులన్నీ ఆహార భద్రతా కార్డు లబ్ధిదారులను కూడా ఉచిత చికిత్సలకు అనుమతించాల్చిందేనని స్పష్టం చేశారు.
చంద్రబాబులో ఆ మార్పుతో – ఊహించని విధంగా..!!
హైదరాబాద్ లో ఐటీ దాడుల కలకలం.. నెక్స్ టార్గెట్ కేసీఆరేనా?
అద్దాల్లా మెరవబోతున్న మునుగోడు రోడ్లు.. రాజగోపాల్ రెడ్డికి జై కొడుతున్న జనాలు

One Comment