
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై చండూరు సభలో అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. అద్దంకి కామెంట్లపై కాంగ్రెస్ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసిందనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అద్దంకి దయాకర్ దిగొచ్చారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆయన క్షమాపణలు చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి, మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని నిరసిస్తూ శుక్రవారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన మునుగోడులోని చండూరులో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో ప్రసంగించిన అద్దంకి దయాకర్.. కోమటిరెడ్డి వెంకట్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
అద్దంకి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోమటిరెడ్డి అభిమానులు టీపీసీసీ క్రమశిక్షణా కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ సభకు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి కూడా హాజరైన నేపథ్యంలో ఆయనే సాక్షిగా అద్దంకికి పార్టీ నుంచి షోకాజ్ నోటీసు జారీ అయ్యింది. సొంత పార్టీ ఎంపీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వారంలోగా వివరణ ఇవ్వాలంటూ ఆ నోటీసుల్లో కాంగ్రెస్ పార్టీ అదేశించింది.ఈ నోటీసులు అందుకున్న మరుక్షణమే దయాకర్ స్పందించారు. తాను ఏదో ఆవేశంలో నోరు జారి అలా మాట్లాడానని వివరణ ఇచ్చారు. వెంకట్ రెడ్డికి వ్యక్తిగతంగా క్షమాపణ చెబుతున్నట్లు దయాకర్ తెలిపారు. తన వ్యాఖ్యల పట్ల బాధ పడుతున్న కోమటిరెడ్డి అభిమానులు తనను క్షమించాలని అద్దంకి కోరారు. పార్టీకి నష్టం చేయాలన్న ఉద్దేశ్యంతో ఈ వ్యాఖ్యలు చేయలేదనితెలిపారు. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేలోగానే షోకాజ్ నోటీసు జారీ అయ్యిందని, భవిష్యత్తులో మరోమారు ఇలా జరగకుండా జాగ్రత్తపడతానని అద్దంకి దయాకర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి …
- మునుగోడుపై రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్! ఒకే దెబ్బకు మూడు పిట్టలు..
- మాజీ ఎంపీ పొంగులేటి నివాసానికి బండి సంజయ్.. ఏం జరుగుతోంది?
- సహకార లీలలు.. ఫోర్జరి చేసి లక్షల రూపాయలు స్వాహా
- పుష్యపౌర్ణమికే ‘పౌషీ’ అనే పేరు ఈ రోజున వస్త్రదానం చేయడం మంచిది.
- కల్వకుర్తిలో దూసుకువస్తున్న యువకేరటం.. ఉప్పల చూపు అసెంబ్లీ వైపు ..?