
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఒకప్పుడు ఉప ఎన్నికలంటే టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్కు భయమే లేదు. తెలంగాణ కోసం ఆయన పలుమార్లు తనతో పాటు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో రాజీనామా చేయించిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితుల్లో టీఆర్ఎస్కు ఉప ఎన్నిక భయం పట్టుకుందా? అంటే… ఔననే సమాధానం వస్తోంది. రాజగోపాల్రెడ్డి బీజేపీలో నేడో రేపో చేరుతారనే సంకేతాలు వెలువడుతున్నాయి.
Also Read : అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్.. మధ్యలో కోమటిరెడ్డి! గంటకో ట్విస్ట్ తో రాజకీయ రచ్చ..
బీజేపీలో చేరాక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని చెబుతున్నారు. అదే జరిగితే మునుగోడుకు ఉప ఎన్నిక తప్పదు. మునుగోడు ఉప ఎన్నిక జరిగితే… మునిగేదెవరో, తేలేదెవరో అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్ని రకాలుగా బలమైన నాయకుడు. మరోవైపు ఉప ఎన్నికలు తెలంగాణ అధికార పార్టీకి కలిసి రావడంతో లేదు. దుబ్బాక, హుజూరాబాద్లలో టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాల్ని బీజేపీ దక్కించుకుంది. ఒక్క నాగార్జునసాగర్లో మాత్రం టీఆర్ఎస్ గెలుపొంది పరువు నిలుపుకుంది. అందుకే మునుగోడు ఉప ఎన్నిక అంటే టీఆర్ఎస్ భయం పట్టుకుంది.
Also Read : మూడు నెలల క్రితం MLA స్టిక్కర్ పడేశాడట!.. మంత్రి మల్లారెడ్డి కవరింగ్ అదుర్స్..
ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉండడంతో ఉప ఎన్నికల్లో ఫలితం ఏ మాత్రం తేడా కొట్టినా అసలుకే ఎసరు వస్తుందనే భయం కేసీఆర్తో పాటు టీఆర్ఎస్ నేతల్ని వెంటాడుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మునుగోడుకు ఉప ఎన్నిక రావచ్చనే ప్రచారం జరుగుతోంది. అక్కడి నుంచి కాంగ్రెస్ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. ఒకవేళ మునుగోడులో ఉప ఎన్నిక జరిగి, టీఆర్ఎస్ ఓడితే మాత్రం… తెలంగాణలో అధికార మార్పిడికి కౌంట్డౌట్ స్టార్ట్ అయ్యినట్టే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Read Also : ఢిల్లీలో కేసీఆర్ ఏం చేస్తున్నారు? పీకే టీమ్ తుది నివేదిక ఇచ్చిందా? అసెంబ్లీ రద్దు అప్పుడేనా?
బీజేపీకి అనూహ్యమైన నైతిక బలం తోడైనట్టే. ఇక కాంగ్రెస్ పరిస్థితి చెప్పడానికి ఏమీ వుండదని అంటున్నారు. మునుగోడు అనే ఉప ఎన్నిక జరిగితే… అనేక రాజకీయ సమీకరణలకు కారణమవుతుందనే చర్చ మాత్రం విస్తృతంగా సాగుతోంది. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని పార్టీలోనే కొనసాగేందుకు కాంగ్రెస్ పెద్దలు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అధికారమే లక్ష్యంగా రాజకీయాలు సాగే కాలంలో అభిమానాలు, బుజ్జగింపులు పని చేస్తాయనుకోవడం అవివేకమే అవుతుంది.
ఇవి కూడా చదవండి :
- ప్రజల సమస్యలను గాలికి వదిలేస్తున్న ప్రజాప్రతినిధులు
- వెక్కిరిస్తూ… వెల్కమంటున్న హాస్టల్…!!
- రాజగోపాల్ రెడ్డికి దిగ్విజయ్ సింగ్ ఫోన్… ఢిల్లీకి రావాలని పిలుపు
- విశాఖ వివాహిత మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్.. ప్రియుడితో నెల్లూరులో ప్రత్యక్షం
- ఫిలిప్పీన్స్ ఉత్తర భాగంలో భారీ భూకంపం…
2 Comments