
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : రాజ్భవన్ లోని అమ్మవారి గుడి ప్రాంగణంలో బోనాలు పండుగను శనివారం ఘనంగా నిర్వహించారు. పండుగలో భాగంగా గవర్నర్ తమిళి సై స్వయంగా బోనమెత్తారు. రాజ్ భవన్ సిబ్బంది, రాజ్ భవన్లో నివసించే కుటుంబాలతో కలిసి తన నివాసం నుంచి ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బోనాల పండుగ జరుపుకున్నారు.
Read Also : వరదలకు కొట్టుకుపోయిన 163వ జాతీయ రహదారి
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బోనాల పండుగ వెనుక ఎంతో చరిత్ర ఉందని అన్నారు. అషాడ, శ్రావణ మాసాల్లో బోనాల పండుగను ఎంతో భక్తితో నిర్వహిస్తారన్నారు. ఆషాడ మాసంలో ఎక్కువగా నల్ల పోచమ్మను కొలుస్తారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారన్నారు. ఈ సంవత్సరం బోనాల పండగ నిర్వహించేందుకు ఒక ప్రత్యేకత ఉందని… అమ్మవారి దయవల్ల సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని గవర్నర్ చెప్పారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ అని పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. వరదలు సంభవిస్తున్న కారణంగా అందరూ జాగ్రత్తగా ఉండాలని గవర్నర్ తమిళిసై సూచనలు చేశారు.
Also Read : కోమటిరెడ్డి రాజీనామా ఎఫెక్ట్… నూతన మండలంగా గట్టుప్పల్
మరోవైపు ఆదివారం భాగ్యనగరంలో జరిగే బోనాల ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. బోనాలకు ఆయా ఆలయ కమిటీలు అన్ని ఏర్పాట్లు చేశాయి. ఆలయాలన్నీ విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఊరూవాడా అమ్మవారి ఆలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. రేపు ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు ఆయా ప్రాంతాల్లో అమ్మవార్లకు బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించనున్నారు.
ఇవి కూడా చదవండి :
- సింగరేణిలో ఆదాని ఎంట్రీని కెసిఆర్ ఆపగలడ…??
- తెలంగాణపై అమిత్ షా ప్రత్యేక నజర్…
- తెలంగాణలో కాంగ్రెస్ కు భారీ షాక్.. బీజేపీలోకి రాజగోపాల్ రెడ్డి!