
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : చిలీలో సముద్రవేటకు వెళ్లిన మత్స్యకారుల బృందానికి 16 అడుగుల పొడవున్న అరుదైన చేప చిక్కింది. సముద్రం ఒడ్డుకు తీసుకొచ్చి క్రేన్కి వేలాడుదీసిన వీడియో క్లిప్లు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చాలా పొడవుగా కనిపిస్తున్న ఈ చేపను ‘ఓర్ ఫిష్’గా గుర్తించారు. ఇది 5 మీటర్లకుపైగా(16 అడుగులు) పొడవు ఉంది. అరుదైన ఈ చేప కనిపించడంతో జనాలు హడలిపోతున్నారు. ఇందుకు ఒక బలమైన కారణం ఉంది. ఓర్ ఫిష్ కనిపించడాన్ని శకునంగా నమ్ముతారు. సునామీ, భూకంపాలు వస్తాయని ఒక విశ్వాసం ఉంది. ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘ఇదొక భయపెట్టే అద్భుతమైన చేప’ అని పేర్కొన్నాడు. ఎందుకంటే.. సముద్రగర్భం లోతుల్లో జీవించే ఓర్ ఫిష్ భూపొరల్లో కదలికలు వచ్చినప్పుడు మాత్రమే సముద్రజలాల ఉపరితలానికి చేరతాయని ఓ యూజర్ వెల్లడించాడు. జలాల్లో పైకి వచ్చాయంటే సముద్ర గర్భంలో భారీ భూకంపాలు సంభవిచ్చినట్టు సంకేతమని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. కాగా తొలుత ఈ వీడియోని టిక్టాక్లో పోస్ట్ చేశారు. దాదాపు 10 మిలియన్ల ఓట్లు వచ్చాయి.
Also Read : తెలంగాణా రాజకీయాల్లో రహస్య భేటీ దుమారం?
ఓర్ ఫిష్ కనిపిస్తే ఏదో అశుభం జరగబోతోందని కొన్ని చోట్ల పూర్వకాలం నుంచి నమ్ముతున్నారు. ముఖ్యంగా సునామీ, భూకంపాలు వస్తాయని విశ్వసించేవారని మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి. అయితే ఈ సిద్ధాంతాన్ని సైన్స్ నిర్ధారించలేదు. కాగా ప్రస్తుతం ఈ చేప జలాలపైకి రావడానికి కారణం ఏంటో అధికారులు గుర్తించాలని సూచనలు అందుతున్నాయి. కాగా ఓర్ ఫిష్ పొడవు 11 మీటర్ల వరకు ఉంటుంది. ఇవి సముద్రపు నీటి అడుగున జీవిస్తాయి. అయితే ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు, బ్రీడింగ్ సమయంతోపాటు చనిపోయాక కూడా జలాలపైకి వస్తాయని నిపుణులు వివరించారు. ఈ చేపలు కనిపించడం చాలా అరుదు. చిలీ కంటే ముందు ఏప్రిల్ నెలలో న్యూజిలాండ్లో ఒక ఓర్ ఫిష్ కనిపించింది. స్థానికంగా బీచ్కు వెళ్లినవారు దీనిని గుర్తించారు.
ఇవి కూడా చదవండి :
- ఖరారైన పవన్ కళ్యాణ్ నియోజకవర్గం..??
- ముఖ్యమంత్రి కెసిఆర్ పై బండి సంజయ్ ఫైర్…
- ముందస్తు ఎన్నికలపై స్పష్టతనిచ్చిన కేటిఆర్…
- హైదరాబాద్లో భారీగా ఇన్స్పెక్టర్ల బదిలీ….
- సమంత – చైతన్య విడాకులపై మురళీమోహన్ ఆసక్తికరమైన కామెంట్..!!