Telangana

తెలంగాణా రాజకీయాల్లో రహస్య భేటీ దుమారం?

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ ప్రతినిధి : తెలంగాణలో ముందస్తు ఎన్నికల హడావుడి స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీలన్నీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ రాజకీయాన్ని మరింత రక్తి కట్టిస్తున్నాయి. అధికార టీఆర్ఎస్‌ను గద్దె దింపేందుకు కాంగ్రెస్, బీజేపీ గట్టిపోటీ ఇస్తోన్న తరుణంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కేసీఆర్ గుట్టు అంతా తనకు తెలుసని, ఆయన బలమేంటో, బలహీనత ఏంటో దగ్గర ఉండి చూసిన వ్యక్తిని తాను అని ఈటల ఇటీవల చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్‌ను ఢీ కొట్టబోయేది తానేనని తన చేతిలో ముఖ్యమంత్రి ఓటమి పాలు కావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. అయితే, అపోజిషన్‌లోని బీజేపీకి చెందిన ఎమ్మెల్యేగా ఈటల వ్యాఖ్యలపై ఓ వైపు చర్చ జరుగుతుండగానే అదే సమయంలో మరో వైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా చర్చకు దారి తీశాయి.

Read Also : సమంత – చైతన్య విడాకులపై మురళీమోహన్ ఆసక్తికరమైన కామెంట్..!!

గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్‌పై తాను పోటీ చేసి గెలవబోతున్నానని ఈటల రాజేందర్ కామెంట్స్ పై రేవంత్ రెడ్డి ఆసక్తికరంగా స్పందించారు. గజ్వేల్ నియోజకవర్గంలో గెలవబోయేది మాత్రం కాంగ్రెస్ అభ్యర్థియేనని అన్నారు. గజ్వేల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మాత్రమే కేసీఆర్‌ను ఓడిస్తారని రేవంత్ చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. ఓ వైపు ఈటలను చూస్తే తానే కేసీఆర్‌ను ఓడిస్తానని చెబుతుంటే రేవంత్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి చేతిలోనే కేసీఆర్ ఓడిపోబోతున్నారని చెప్పడం పొలిటికల్ కారిడార్‌లో కొత్త చర్చకు తెరలేసినట్లైంది. రేవంత్ మాటలు చూస్తుంటే ఈటల రాజేందర్ మరోసారి పార్టీ మారబోతున్నారా? బీజేపీని కాదని కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారా అనే రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Also Read : భార్య ప్రియుడితో లేచిపోయిందని తనువు చాలించిన భర్త…

ఈటల రాజేందర్ పార్టీయేతర కార్యకలాపాలకు పాల్పడుతున్నారనేది టీఆర్ఎస్ అతడిపై మోపిన ఆరోపణల్లో ఒకటి. కేసీఆర్ నిర్ణయాలకు వ్యతిరేకంగా రహస్యంగా ఇతర పార్టీ నేతలను కలుస్తున్నారని టీఆర్ఎస్ ఆరోపించింది. ఈటల రాజేందర్ ఎవరికి తెలియకుండా అత్యంత రహస్యంగా ఒక్కడే వేకువ జామున బయటకు వెళ్లి ఇతర పార్టీ నేతలతో మంతనాలు జరిపారని, ఈ విషయం కేసీఆర్ పసిగట్టి అతడికి చెక్ పెట్టారనే టాక్ అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. అయితే, అచ్చం ఇలాంటి సీన్ ఇప్పుడు కాంగ్రెస్‌లోనూ చోటు చేసుకోవడం సంచలనం అవుతోంది. గత ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఎవరికి తెలియకుండా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ తాను బస చేస్తున్న హైదరగూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బయటకు వెళ్లడం ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది.

Read Also : ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కెసిఆర్… అభ్యర్ధుల ఎంపికలో కొత్త వ్యూహం

ఆయనతో పాటు పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు ఉన్నారని వీరు రేవంత్ రెడ్డి, జానారెడ్డి వంటి పెద్దలను కలిసి చర్చించుకున్నారని ఆ తర్వాత ఈ నలుగురు కలిసి ఎక్కడి వెళ్లారు? ఎవరిని కలిశారనేదానిపై రాజకీయ చర్చ జరుగుతోంది. అయితే వీరంతా ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా సీక్రెట్ వ్యవహారం నడిపించారని తెలుస్తోంది. నిజంగా ఎక్కడిపోయారు ఎవరిని కలిశారనేది బయటకు తెలియనప్పటికీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, మంత్రులను కలిశారని, బీజేపీకి చెందిన ఈటలనూ కలిశారనే ప్రచారం జరుగుతోంది.

ఇవి కూడా చదవండి : 

  1. లేటు వయసులో ఘాటు ప్రేమ.. బాలివుడ్ స్టార్ సుస్మితాసేన్ తో లలిత్ మోదీ డేటింగ్
  2. ‘ఆరా’ సర్వే ఫలితాలపై స్పందించిన కాంగ్రెస్, బిజేపి
  3. విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి… ముగ్గురికి తీవ్ర గాయాలు
  4. నిత్య పెళ్ళికొడుకు… వీధికో బార్య…
  5. అమ్మాయిని పంపుతామంటే కోటిన్నర ట్రాన్స్‌ఫర్ చేసిన డాక్టర్….

ad 728x120 SRI swami - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.