
క్రైమ్ మిర్రర్, అమరావతి : ఏ పార్టీకి అయినా పునాదులు కార్యకర్తలే. వారి మోసిన జెండా వల్లే నేడు నాయకులుగా చెప్పిన వారు అనుభవిస్తున్న పదవులు ఎన్నికల ముందు వరకూ కార్యకర్తలకు పెద్దపీట వేస్తామని చెప్పుకునే నాయకులు.. తాము గెలిచిన తర్వాత పూర్తిగా వారిని పక్కన పెట్టేసే సందర్భాలు సర్వసాధారణం. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ కూడా ఇందుకు మినహాయింపు కాదు. అధికారంలో రావడానికి పదేళ్ల పాటు పాటు పడిన కార్యకర్తని ఏ మాత్రమూ నాయకులు పట్టించుకోని స్థితిని మూడేళ్లుగా వారు చూశారు. ఎన్నో చేదు అనుభవాలను కూడా కాచి వడబోశారు. చాలా ఆలస్యంగా అయినా కార్యకర్తల వద్దకు పార్టీ పెద్దలు ఇప్పుడు వస్తున్నారు అని అంటున్నారు. వైసీపీ ప్లీనరీ వేళ కార్యకర్తల గురించే పూర్తి ఫోకస్ పెడతారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా వెంట రాని.. కంట కనబడని కార్యకర్తలకు పెద్ద పీట వేస్తామని అంటున్నారు.
Read More : టిడిపి కార్యకర్తలను వేధించేవారిని వదిలిపెట్టను.. చంద్రబాబు
ఇన్నాళ్లూ దూరం పెట్టీ.. ఇప్పటిదాకా ప్రభుత్వ సారధిగానే వ్యవహరించిన జగన్ అధికార కార్యక్రమాలలో పాలుపంచుకుని అక్కడే బిజీగా ఉంటున్నారు. సమీక్షలు చేస్తున్నారు. వీలైతే జిల్లా టూర్లు పెట్టుకుని అక్కడ సభలలో పాలుపంచుకుంటున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో క్యాడర్ తో ఎక్కడా కలిసింది లేదు. దాంతో వారు తమ బాధలను చెప్పుకునే వీలు లేకపోతోందని రగిలిపోతున్నారు. ఇక కార్యకర్తల కష్టంతో ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు మంత్రులు అయ్యారు. పదవులలో ఉన్నారు. వారు సైతం క్యాడర్ను పెద్దగా పట్టించుకోవడంలేదు. దీంతో విసిగి వేసారిన క్యాడర్ పార్టీకి చాన్నాళ్లుగా దూరంగా ఉంటోంది. 2017 వైసీపీ ప్లీనరీలో ఉరకలెత్తిన క్యాడర్ ఈసారి మాత్రం అలిగి దూరంగా ఉందన్న చర్చ నడుస్తోంది.
Also Read : వైసిపి ప్లినరి వేళ…..టిడిపి కౌంటర్ ప్లాన్
క్యాడర్ లో అసంతృప్తి ఉందని ఎన్నికల వ్యూహకర్త రుషిరాజ్ సింగ్ బృందం కూడా నివేదికలో పేర్కొందంట. దాంతో అలెర్ట్ అయిన వైసీపీ పెద్దలు ప్లీనరీ సాక్షిగా వారిని బుజ్జగించేందుకు నిర్ణయించారని సమాచారం. వైసీపీ ప్లీనరీ రెండు రోజుల పాటు గుంటూరులో రెండు రోజులూ పూర్తిగా ప్రభుత్వ జరగనుంది. కార్యక్రమాలను పక్కన పెట్టి జగన్ పార్టీ సమావేశాల్లోనే బిజీ అవుతారు అంటున్నారు. ఈ సందర్భంగా సీఎం కార్యకర్తలను కలుసుకునేందుకు ఆసక్తిని చూపిస్తారని సమాచారం. సముచిత స్థానం కల్పిస్తారని ప్రచారం క్యాడర్ లో మెరికల్లాంటి వారిని గుర్తించి వారికి వరాలు ఇవ్వాలని.. వారికి కూడా ప్రభుత్వ పరంగా చేయాల్సింది చేయాలని కూడా భావిస్తున్నట్లు తెలిసింది.
Read More : కేసీఆర్ పై బండి సంజయ్ బ్రహ్మాస్త్రం.. వణికిపోతున్న టీఆర్ఎస్ లీడర్లు! ఏం జరగబోతోందో?
బలమైన క్యాడర్ కి త్వరలో సముచితమైన స్థానం కల్పించేలా చర్యలు ఉంటాయని చెబుతున్నారు. ఈసారి ప్లీనరీకి కార్యకర్తలు ఎంత సంఖ్యలో హాజరు అవుతారు… వారు కనుక వస్తే ఏమేమి చెబుతారు అన్న ఆసక్తి అయితే ప్రస్తుతం ఉంది. వారు కనుక తమ అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కితే…. అది కూడా జగన్ సమక్షంలో మాట్లాడితే మాత్రం సంచలనమే అవుతుంది. అయితే క్యాడర్ అలా చేయకుండా బుజ్జగించే చర్యలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి అంటున్నారు.
ఇవి కూడా చదవండి …
- సినిఫక్కిలో గంజాయి రవాణా…ఉప్పల్లో 440 కిలోల గంజాయి పట్టివేత…
- రైతుబంధు సొమ్ము… పాత బాకిలకు !
- టార్గెట్ సబితమ్మ…. మంత్రిపై భూకబ్జా ఆరోపణలు రిపీట్
- ఆమె వయసు 54.. మేకప్ తో 30 ఏళ్లలా మేనేజ్ చేసి పెళ్లి చేసుకుంది..
- రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నా.. బడంగ్ పేట మేయర్
2 Comments