Andhra Pradesh

ప్రధాని సభకు డుమ్మా కొట్టిన ఎంపీ రఘురామ..!

క్రైమ్ మిర్రర్, అమరావతి ; ప్రధాని మోదీ భీమవరం పర్యటన సందర్భంగా రాజకీయం వేడెక్కుతోంది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు కార్యక్రమానికి హాజరయవడంపై ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నర్సాపురం ఎక్స్ ప్రెస్ లో హైదరాబాద్ నుండి భీమవరం బయలుదేరిన ఆయన అర్ధాంతరంగా మధ్యలోనే వెనుదిరిగారు. లింగపల్లిలో ట్రైన్ ఎక్కిన రఘురామకృష్ణంరాజు.. బేగంపేట్ రైల్వే స్టేషన్లో దిగిపోయారు. ఏపీ పోలీసులు అనుసరిస్తుండటంతోనే ఎంపీ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే రఘురామకు అనుకూలంగా భీమవరంలో ర్యాలీ చేపట్టిన యువకులతో పాటు ఆయన అనుచరులపై కేసులు నమోదు చేసిన నేపథ్యంలో వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వెనుదిరుగుతున్నట్లు రఘరామ చెప్పారు. ఏపీ పోలీసులు అనుసరిస్తుండటంతోనే ఆయన ఉన్నట్టుండి తన పర్యటనను రద్దు చేసుకున్నారు.

రఘురామ ఆదివారం రాత్రి లింగంపల్లి రైల్వేస్టేషన్‌ నుంచి నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో అనుచరులతో కలిసి భీమవరం బయలుదేరారు. రఘురామను ఏపీ పోలీసులు అనుసరిస్తున్నారని తెలియడంతో.. ఆయన హైదరాబాద్‌లోని బేగంపేట స్టేషన్‌లో రైలు దిగిపోయారు. తన అనుచరులు కొందరిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని.. వారిని మరింత ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక పర్యటన రద్దు చేసుకున్నారని.. ఆయన తిరిగి వెళ్లిపోయారని తెలుస్తోంది. భీమవరం ఎలాగైనా వెళ్లాలని భావించినా.. సొంత జిల్లా నుంచి ఆయనకు ఫోన్‌ వచ్చినట్లు సమాచారం. శనివారం ఆయనకు మద్దతుగా ర్యాలీ నిర్వహించిన కొంతమంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారట. ఆ యువకులు తల్లిదండ్రులు ఎంపీకి సమాచారం ఇచ్చారు. ఈ ఘటన తనను మనస్తాపానికి గురి చేసిందని, యువకులపై కేసు పెట్టడం దారుణమని రఘురామ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రొటోకాల్‌ విషయంలో రాష్ట్ర యంత్రాంగం అడ్డంకులు సృష్టించిందని మండిపడ్డారు. తన అభిమానులపై అక్రమ కేసులు పెడుతున్నట్టు సమాచారం రావడంతో.. రైలు దిగి వెనుతిరగాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. ఎంపీ రఘురామకృష్ణరాజు విషయంపై డీఐజీ పాలరాజు క్లారిటీ ఇచ్చారు. ఎంపీ విషయంలో హైకోర్టు ఉత్తర్వుల మేరకు నడుచుకుంటామని.. పీఎంవో నుంచి భీమవరానికి వచ్చిన జాబితాలో రఘురామ పేరు లేదన్నారు. ఆయన భీమవరం వస్తున్నట్టుగా కూడా తమకు సమాచారం లేదని చెప్పుకొచ్చారు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణకు వెళ్లాలని రఘురామ భావించారు. తన వాహనానికి అనుమతివ్వాలని కోరారు.. కానీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కానీ పోలీసులు నిరాకరించడంతో కలెక్టర్‌‎కు రఘురామరాజు ఫిర్యాదు చేశారు.

అక్కడి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తన అనుచరులతో కలిసి లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో నర్సాపురం ఎక్స్ ప్రెస్ ఎక్కారు. కానీ ఊహించని పరిణామాలతో ఆయన వెనక్కు తగ్గారు. మరోవైపు రఘురామ కృష్ణం రాజు భీమవరానికి రాకముందే ఏపీ పోలీసులు షాకిచ్చారు. ఆయన్ను వేదికపైకి అనుమతించే అంశంపై క్లారిటీ ఇచ్చారు. పీఎంఓ నుంచి వచ్చిన జాబితాలో హెలిపాడ్ వద్దకు అనమతించే జాబితాలోగానీ, వీఐపీ గ్యాలరీ జాబితాలో గానీ.. రఘురామ కృష్ణం రాజు పేరు లేదని ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు స్పష్టం చేశారు. అంతేకాదు ఎంపీ వస్తున్నట్లు సమాచారం కూడా లేదన్నారు. దీంతో ఆయన వాహనానికి ఎంట్రీపాస్ కూడా జారీ చేయలేదు. ఈ వ్యవహారంపై రఘురామ కృష్ణం రాజు ఉన్నతాధికారులను సంప్రదించగా సరైన సమాధానం ఇవ్వనట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల రఘురామకు ఏపీ హైకోర్టు షాకిచ్చింది. తనపై సీఐడీ విచారణకు అనుమతి, సీఐడీ నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.

ఈ సందర్భంగా రాజద్రోహం సెక్షన్‌ మినహా మిగిలిన సెక్షన్ల కింద రఘురామ కృష్ణరాజును విచారించుకోవచ్చని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రెండు వర్గాల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టే విధంగా రఘురామ వ్యాఖ్యలు చేశారని సీఐడీ సుమోటోగా ఆయనపై కేసు నమోదు చేసింది. అయితే రాజద్రోహం నేరానికి సంబంధించి కేసులపై పిటిషనర్‌ రఘురామ తరఫున బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. రఘురామ వాదనతో ఏకీభవించని హైకోర్టు రాజద్రోహం (ఐపీసీ 124ఎ) చట్టాన్ని సుప్రీంకోర్టు నిలుపుదల చేసిన నేపథ్యంలో పిటిషనర్‌పై ఏపీ సీఐడీ పోలీసులు నమోదు చేసిన మిగిలిన సెక్షన్ల విషయంలో దర్యాప్తు పేరుతో పిలిచి ఇబ్బందులకు గురి చేయకుండా నిలువరించాలని రఘురామ ఈ పిటిషన్ లో కోరారు.

భీమవరంలో మోదీ పర్యటన ఖరారైనప్పటి నుంచి స్థానిక ఎంపీ రఘురామ కృష్ణం రాజు వస్తారా రారా అనే అంశం తీవ్రచర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. దీనిపై ఎంపీ హైకోర్టుకు కూడా వెళ్లారు. తనను అడ్డుకోకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని, కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని ఆయన కోర్టులో పిటిషన్ వేయగా.. చట్టప్రకారం వ్యవహరించాలని కోర్టు ఆదేశించింది.

 ఇవి కూడా చదవండి ..

  1. తెలంగాణ బీజేపీకి ప్రధాని మోడీ షాక్… కేసీఆర్, టీఆర్ఎస్ పేరు ఎత్తకుండానే ప్రసంగం
  2. ఇంకా ఎన్నాళ్లూ… ప్రజల్ని మభ్యపెడతావు.. ఏజెంట్లను దొంగలు చేసే ప్రయత్నం చేస్తావా?
  3. రేవంత్ రెడ్డి ఇజ్జత్ తీసిన కాంగ్రెస్ సీనియర్ నేత..
  4. ప్రధానిలా కాదు సేల్స్‌మెన్‌లా పనిచేస్తున్నారు.. నరేంద్ర మోడీపై కేసీఆర్ నిప్పులు
  5. ఈటల రాజేందర్ మరో ఏక్ నాథ్ షిండేనా? కేసీఆర్ ముందే గ్రహించి అప్రమత్తమయ్యారా?

ad 728x120 SRI swami - Crime Mirror

Show More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Continue in browser
Crime Mirror
To install tap
and choose
Add to Home Screen
Continue in browser
Crime Mirror
To install tap Add to Home Screen
Add to Home Screen
Crime Mirror
To install tap
and choose
Add to Home Screen
Continue in browser
Crime Mirror
To install tap
and choose
Add to Home Screen
Continue in browser
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.