
క్రైమ్ మిర్రర్: తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈసారి 5,03,579 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 4,53,201 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 2,23,779 బాలురు, 2,29,422 మంది బాలికలు ఉన్నారు. 87 శాతం మంది బాలురు, 92.45 శాతం మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా పదో తరగతి పరీక్షల్లో 90 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
Read More : ఆటోపై తెగిపడ్డ హైటెన్షన్ వైర్.. 8 మంది సజీవదహనం
తాజా ఫలితాల్లో సిద్ధిపేట జిల్లా 97 శాతం ఉత్తీర్ణతతో టాప్లో నిలిచింది. హైదరాబాద్ 79 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది. 3007 స్కూళ్లలో 100 శాతం ఉత్తీర్ణత నమోదవగా 15 స్కూళ్లలో ఒక్కరూ పాస్ కాలేదు. ప్రైవేట్గా మొత్తం 819 మంది పదో తరగతి పరీక్షలు రాశారు. వీరిలో 448 మంది బాలురు, 371 మంది బాలికలు ఉండగా.. 51 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు మంత్రి అభినందనలు తెలిపారు. ఫెయిలైన విద్యార్థులు ఆందోళన చెందవద్దని.. ఓటమే గెలుపుకు తొలి మెట్టుగా భావించి ముందుకు సాగాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. ఆగస్టు 1 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని తెలిపారు.
విద్యార్థులు ఈ వెబ్సైట్స్లో టెన్త్ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు:
result.cgg.gov.in
tsbie.telangana.gov.in
manabadi.co.in
తెలంగాణలో ఈ ఏడాది మే 23 నుంచి జూన్ 1 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. కరోనా కారణంగా ఈసారి 11 పేపర్లను 6 పేపర్లకే కుదించారు. సిలబస్ను 30 శాతం తగ్గించి కేవలం 70 శాతం సిలబస్కే పరీక్షలు నిర్వహించారు. ప్రశ్నాపత్రాల్లో ఛాయిస్ను పెంచారు. కరోనా కారణంగా రెండేళ్ల పాటు పరీక్షలు లేకుండానే ప్రభుత్వం విద్యార్థులను పాస్ చేసింది. రెండేళ్ల తర్వాత నిర్వహించిన పరీక్షలు కావడంతో ఫలితాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూశారు.
ఇవి కూడా చదవండి …
- గవర్నర్ తో జోకులు.. కిషన్ రెడ్డితో నవ్వులు! బీజేపీని షాక్ ఇచ్చిన కేసీఆర్..
- చినజీయర్ పై కేసు… కేసీఆర్ కసి తీర్చుకుంటున్నారా?
- జూన్ 28న టీహబ్ ప్రారంభోత్సవం.. మోడీ టూర్ కు ముందు కేసీఆర్ ప్లాన్
- మునుగోడు టీఆర్ఎస్ టికెట్ బీసీకే! పీకే సర్వేలో నారబోయినే టాప్?
- చేరికలతో పెరిగిన వర్గ పోరు.. రేవంత్ రెడ్డిపై సీనియర్లు గుర్రు