
క్రైమ్ మిర్రర్, అమరావతి : నగదు బదిలీ విషయంలో ఏపీ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. నగదు బదిలీ పథకాన్ని ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు ఏపీ పౌరసరఫరాల మంత్రి కారుమూరి నాగేశ్వర రావు ప్రకటించారు. మంత్రి అధ్యక్షతన పౌరసరఫరాల శాఖపై ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే నగదు బదిలీ పథకాన్ని పక్కన పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. యాప్లో సాంకేతిక లోపం తలెత్తడం వల్లే ఈ నిర్ణయమని, తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలకు వెల్లడి చేస్తామని ఆయన తెలిపారు.
రైతులకు ఎలాంటి ఆలస్యం లేకుండా, సకాలంలోనే డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కారుమూరి హామీ ఇచ్చారు. ప్రజలకు ఇచ్చే బియ్యం నాణ్యతలో రాజీ ఉండదని, అలాంటి చర్యలే తీసుకుంటున్నామని అన్నారు. రైతుల కల్లాల వద్దకే వెళ్లి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, జిల్లాను యూనిట్ కేంద్రంగా తీసుకొని చేస్తామని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి ..
- ఆ ఇద్దరే హంతకులు… ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
- తల్లి కాబోతున్న సింగర్ సునీత… ఇన్ డైరెక్టుగా చెప్పారా?
- రేవంత్ టెంట్ మాస్టర్… అరవింద్ దొంగ,దగుల్బాజీ, డెకాయిట్!
- చంద్రబాబుకు నోటీసులు… ఏం జరగబోతోందో?
- నాడు ఫ్యాక్టరీపై పోరాటం.. నేడు జగనే ప్రారంభం
One Comment