
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని తెలుస్తోంది. ఢిల్లీ తర్వాత పంజాబ్ లో అధికారం చేపట్టిన ఆప్… మరికొన్ని రాష్ట్రాలపై ఫోకస్ చేసింది. అందులో తెలంగాణ రాష్ట్రం కూడా ఉంది. తెలంగాణలో గెలుపునకు అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న ఆఫ్ చీఫ్ కేజ్రీవాల్.. ఇందు కోసం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నారని తెలుస్తోంది. త్వరలో తెలంగాణలో ఆ పార్టీ పాదయాత్రలు చేయనున్నట్లు తెలుస్తోంది అందులో భాగంగానే తెలంగాణలో బిగ్ పర్సనాలిటీకి గాలం వేశారని అంటున్నారు. కేజ్రీవాల్ స్కెచ్ లో భాగంగా ఆప్లో టీజేఎస్ విలీనం కాబోతోందనే చర్చ జరుగుతోంది.
Read More : వాళ్లకు టికెట్లు ఇస్తే గోవిందా… కేసీఆర్ కు పీకే టీమ్ రిపోర్ట్!
ఇటీవలే తెలంగాణ జనసమతి నేతలు రహస్యంగా సమావేశమైయ్యారని సమాచారం. ఇందులో ఆప్ లో టీజేఎస్ విలీనంపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ శివారు ఇబ్రహీంపట్నం పరిధిలోని రావిరాల ఫామ్ హౌస్లో ఈ భేటీ సాగిందని చెబుతున్నారు. సమావేశంలో కోదండరామ్తోపాటు టీజేఎస్ ముఖ్య నేతలు పాల్గొన్నారట. సమావేశంలో ఆప్లో విలీనం చేయాలన్న ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై పార్టీ నేతలతో కోదండరాం మంతనాలు జరిపారు. సమావేశంలో చాలా మంది నేతలు ఆప్వైపే మొగ్గు చూపినట్లు ప్రచారం జరుగుతోంది. టీజేఎస్ అధినేత కోదండరాం మాత్రం మరికొంతకాలం వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల వేళ కీలక నిర్ణయం తీసుకుందామని నేతలతో ఆయన చెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Read More : ఎంపీ అర్వింద్ కు కవిత దిమ్మతిరిగే షాక్. .
మరోవైపు ఆప్ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ త్వరలో తెలంగాణలో పర్యటిస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈక్రమంలోనే టీజేఎస్ నేతలతో ఆప్ నాయకులు మంతనాలు జరిపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కేజ్రీవాల్ తెలంగాణ పర్యటనకు ముందే విలీన ప్రక్రియ పూర్తవుతుందని అంటున్నారు.
ఇవి కూడా చదవండి ..
- టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎక్సైజ్, ఈడీ శాఖల మధ్య వార్?
- తెలంగాణ ప్రజలు నూకలు తినాలా.. ఇంత అవమానమా?
- భూకబ్జా కేసులో కోర్టు విచారణకు శివలింగం..
- జనసేనలోకి టీడీపీ నేతలు జంప్?
- సీఎం నితీశ్ కుమార్ పై దాడి.. బీహార్ లో కలకలం