
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఉక్రెయిన్ పై భీకరంగా విరుచుకుపడుతున్న రష్యాకు అంతర్జాతీయ న్యాయ స్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. ఉక్రెయిన్పై చేపట్టిన సైనిక చర్యను తక్షణమే నిలిపివేయాలని ఐసీజే ఆదేశించింది. డాన్బాస్ ప్రాంతంలో ఊచకోత జరిగిందన్న సాకుతో రష్యా..తమ దేశంపై దాడి చేస్తోందని అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉక్రెయిన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 1948 జెన్సైడ్ కన్వెన్షన్ను రష్యా ఉల్లంఘించందని తెలిపింది. దాడిని ఆపాలని ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించింది.
ఈ విచారణకు రష్యా హాజరుకాలేదు. తర్వాత లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చింది. ఈ అంశం న్యాయస్థానం పరిధిలోకి రాదని వాదించింది. న్యాయమూర్తి జోన్.ఈ.డోన్హ్యూ నేతృత్వంలోని ధర్మాసనం..రష్యా సైనిక చర్యను తప్పుబట్టింది. వెంటనే యుద్ధం నిలిపివేయాలని తీర్పునిచ్చింది.ఈతీర్పును రష్యా అమలు చేయకపోతే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి అంతర్జాతీయ న్యాయస్థానం నివేదిస్తుంది. మండలిలో రష్యాకు వీటో పవర్ ఉంది. ఈక్రమంలో ఈ తీర్పు అమలు ప్రశ్నార్థకమేనని న్యాయనిపుణులు విశ్లేషిస్తున్నారు. కోర్టు తీర్పుపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెల్న్స్కీ హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ న్యాయస్థానంలో రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ సంపూర్ణ విజయం సాధించిందన్నారు. అంతర్జాతీయ న్యాయ స్థానం తీర్పును రష్యాలు అమలు చేయాలని తెలిపారు.
మరోవైపు ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగిస్తోంది. ఈ దాడిలో భారీగా ప్రాణనష్టం సంభవించినట్లు తెలుస్తోంది. మేరియుపొల్లోని ఓ థియేటర్పై రష్యా బాంబుల వర్షం కురిపించింది. ఆ సమయంలో అక్కడ 12 వందల మంది వరకు పౌరులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో చాలా మంది వరకు చనిపోయి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్ఆనరు. ఈఘటనలో థియేటర్లో ధ్వంసమైంది. ఉద్దేశపూర్వకంగానే రష్యా సేనలు ..పౌరులపై మారణ హోమానికి పాల్పడ్డారని మేరియుపోల్ నగరపాలక సభ్యులు ఆరోపించారు. కీవ్ నగరంపై కూడా రష్యా దాడులు కొనసాగుతున్నాయి. బాంబు దాడుల్లో మరో ఇద్దరు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు.
ఇవి కూడా చదవండి ..
- తాగిన మత్తులో కారు బీభత్సం.. ముగ్గురు మృతి.?
- సార్వత్రిక సమ్మె జయప్రదం చేయండి… ఆర్.జనార్ధన్
- ట్రాక్టర్ డ్రైవర్కు గుండెపోటు అదుపు తప్పి బోల్తా .. ముగ్గురు మృతి
- పేదప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం .. ఉప్పల ట్రస్ట్ ఛైర్మెన్ వెంకటేష్
- కేబినెట్ విస్తరణకు కేసీఆర్ కసరత్తు.. ఆరుగురు మంత్రులు అవుట్?