National

ఐదు రాష్ట్రాల ఎగ్డిట్ పోల్స్… దేశ వ్యాప్తంగా ఆసక్తి

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీ-ఫైనల్స్‌గా భావిస్తున్న ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ శాసనసభ ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ఘట్టం పోలింగ్ తుది దశకు చేరింది. దీంతో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌పై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెలువడనున్నాయి.

ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి అధికారం దక్కుతుంది? ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు నిలబెట్టుకుంటారా? ఏ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయనేది పలు సంస్థలు, మీడియా వెల్లడించనున్నాయి. ఎన్నికల పోలింగ్‌కు ముందు ఒపీనియన్ పోల్స్‌ను నిర్వహించారు. ఎగ్జిట్ పోల్స్‌ ప్రక్రియలో పలు సంస్థలు పారదర్శక నమూనా పద్ధతిని అనుసరిస్తాయి. వయసు, జెండర్, కులం, మతం, ప్రాంతాలకు అనుగుణంగా సర్వే నిర్వహిస్తారు. కొన్ని సందర్భాల్లో తప్పా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు దాదాపు నిజమయ్యాయి.

Read More : కేసీఆర్‌ ఫ్రంట్‌ కు డైరెక్టర్ పికే, ప్రొడ్యూసర్ పిఎం మోడీ.. నటుడు కేసీఆర్‌

గతేడాది మార్చి-ఏప్రిల్‌లో జరిగిన బెంగాల్, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు దగ్గరగా ఫలితాలున్నాయి. కానీ, బెంగాల్ విషయంలో మాత్రం కొన్ని సంస్థల అంచనాలు తల్లకిందులయ్యాయి. అక్కడ తృణమూల్‌ కాంగ్రెస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయని అంచనా వేశాయి. కానీ, ఫలితాల్లో మాత్రం తృణమూల్‌‌కు ఏకపక్ష విజయం దక్కింది. మొత్తం 292 స్థానాలకు గానూ టీఎంసీ 214 చోట్ల గెలుపొందింది. బీజేపీ 77 సీట్లకే పరిమితమయ్యింది.

యూపీలో మొత్తం 403 సీట్లు ఉండగా.. సాధారణ మెజార్టీకి అవసరమైన స్థానాలు 202. ఎన్నికల షెడ్యూల్ వెలువడటానికి ముందు వరకూ యూపీలో బీజేపీ గెలుపు తథ్యమని అందరూ భావించారు. అయితే, షెడ్యూల్ విడుదల తర్వాత పరిస్థితి మారిపోయింది. ప్రధాన ప్రతిపక్షం సమాజ్‌వాదీ పార్టీ నుంచి గట్టిపోటీని ఎదుర్కొంది. బీజేపీ, ఎస్పీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగింది. పంజాబ్‌లో 117 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఫిబ్రవరి 20న ఒకే విడతలో పోలింగ్ జరిగింది. ఇక్కడ అధికార కాంగ్రెస్, ఆప్, శిరోమణి అకాళీదల్-బీఎస్పీ కూటమి ప్రధానంగా పోటీ పడ్డాయి. మాజీ సీఎం అమరీందర్‌కు చెందిన జనలోక్ కాంగ్రెస్‌తో బీజేపీ జట్టుకట్టి పోటీ చేసింది. ఇక్కడ బీజేపీ ప్రభావం అంతంతమాత్రంగానే ఉంది. ఉత్తరాఖండ్‌లోని 70 సీట్లుకు ఫిబ్రవరి 14న పోలింగ్ ముగిసింది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీలే హోరాహోరీగా తలపడ్డాయి. ఐదేళ్లకు ఒకసారి అధికార మార్పిడి జరిగే సంప్రదాయం కొనసాగుతుందా? లేదా? అనేది మార్చి 10న తెలిపోనుంది. మణిపూర్‌లో 60 సీట్లకు రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించారు. ఇక్కడ కూడా అధికార బీజేపీ కూటమితో కాంగ్రెస్ కూటమి మధ్య ప్రధాన పోటీ. గోవాలోని 40 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ప్రమోద్ సావంత్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్, ఆప్‌, టీఎంసీలు పోటీపడ్డాయి.

ఇవి కూడా చదవండి ..

  1. నాలుగు కాళ్లతో కోడిపిల్ల జననం.. బ్రహ్మంగారి మాట నిజమైందంటున్న జనం
  2. డీజిల్ అంటూ నీళ్ల అమ్మకం.. రంగారెడ్డి జిల్లా పెట్రోల్ బంకులో ఘరానా మోసం
  3. పెరగనున్న విద్యుత్ ఛార్జీలు.. మెట్రో ప్రయాణాలపై భారం
  4. పిల్లి కాటుకు ఇద్దరు మృతి… ఏపీలో షాకింగ్
  5. అసెంబ్లీకి దూరం.. టీడీపీ కీలక నిర్ణయం..

ad 728x120 HUMA copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.