
క్రైమ్ మిర్రర్, అమరావతి : కోడికూర వండలేదనే కోపంతో కన్నె చెల్లిని గొడ్డలితో తెగనరికాడో అన్నయ్య. మద్యం మత్తులో క్షణికావేశంలో ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా కూనవరం మండలం వెంకటాయిపాలెం పంచాయతీ పరిధిలోని వలస ఆది వాసీ గ్రామమైన సన్నాయిగూడెంలో చోటుచేసుకుందీ ఘటన.
పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. దివ్యాంగురాలైన తాటి సోమమ్మ అలియాస్ కోవ్వాసి సోమిడీ(20) అనే యువతి తన తల్లిదండ్రులు చనిపోవడంతో తెలంగాణలోని కరకగూడెం మండలం మద్దన్న గ్రామంలో తన అక్క దగ్గర ఉంటోం ది. వారం కిందట అన్నయ్యను చూద్దామని కూనవరం మండలం ఆదివాసీ గ్రామమైన కన్నాపురంలోని అన్నయ్య నందా ఇంటికి వచ్చింది. అన్న భార్య కొవ్వాసి ఉంగి తన పుట్టింటికి చత్తీస్గడ్ వెళ్లడంతో నంద గురువారం రాత్రి పది గంటలకు అతిగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. నిద్రపోతున్న చెల్లిని లేపి కోడి కూర వండాలని ఆమెతో గొడవకు దిగాడు.
Read More : శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర నిజమేనా? అసలు నిజాలు ఇవేనా?
తాను మళ్లీ వస్తానని ఈ లోపు తనకు కోడికూర వండకపోతే అందరినీ చంపేస్తానని బెదిరించి వెళ్లిపోయాడు. తిరిగి శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో మళ్లీ ఇం టికి వచ్చి చెల్లి సోమమ్మను లేపి కోడికూర వండావా అని అరిచాడు. ఆరోగ్యం బాగోలేక వండలేకపోయానని చెప్పిన సోమమ్మను గొడ్డలి తీసుకుని సోమమ్మ పై తలపై దాడి చేశాడు. దీంతో సోమమ్మ కుప్పకూలి చనిపోయింది.
ఇంట్లో ఉన్న పిల్లలను, చుట్టుపక్కలవాళ్లనూ చంపేస్తానని నంద కేకలు వేశాడు. నందాకు 8మంది సంతానం. దీంతో అప్రమత్తమైన గ్రామస్తులు నందాను తాళ్లతో కట్టేసి వలంటీర్కు సమాచారం అందజేశారు. వాలంటీర్ ఫిర్యాదు మేరకు కూనవరం సీఐ గజేంద్ర, ఎస్ఐ వెంకటేష్ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి ..
- తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరో సంచలన నిర్ణయం..
- నాలుగు రోజుల్లో 60 లక్షల చలానాలు క్లియర్..
- కాంగ్రెస్ కు 40 లక్షల ఏకే 47లు?
- సహకార లీలలు..! – విధులు గాలికి… నిధులు జేబుకి
2 Comments