
క్రైమ్ మిర్రర్, న్యూస్ డెస్క్: నగరంలోని ఓ స్థలం విషయంలో తమకు అడ్డు తగిలాడని ప్రత్యర్థిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ పరిధిలోని చర్లపటేల్ గూడ – కర్ణంగుడా సమీపంలో రియల్టర్లు రఘు, శ్రీనివాస్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులపై దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల కలకలం జరిగిన స్థలంలోనే శ్రీనివాస్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా.. రఘు పరిస్థితి విషమంగా ఉండడంతో బీఎన్ రెడ్డి లోని ఓ ఆస్పత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. సెటిల్మెంట్ కి అని పిలిచి వారిపై కాల్పులు జరిపినట్టుగా రఘు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
భారీ చోరీ కి పాల్పడిన నిందితుడూ అరెస్ట్..
3 Comments