
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. ధర్మ సంరక్షణ కోసం కృషి చేస్తున్న తనను అంతమొందించే ప్రయత్నాలు జరుగతున్నాయని అన్నారు. సంగారెడ్డి జిల్లా గర్డేగావ్లో నిర్మించిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని డెగ్లూర్ పీఠాధిపతి చంద్రశేఖర్ మహారాజ్తో కలిసి రాజాసింగ్ ఆవిష్కరించారు. అనంతరం రాజాసింగ్ మాట్లాడుతూ.. హిందూ ధర్మ రక్షణ అందరి బాధ్యత అని అన్నారు. అందుకోసం కృషి చేస్తున్న తనను హత్య చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని అన్నారు. తాను బతికి ఉన్నంత వరకు ధర్మ సంరక్షణ కోసం పాటుపడతానని స్పష్టం చేశారు.
బీజేపీకి ఓటు వేయకుంటే బుల్డోజర్లు సిద్ధంగా ఉన్నాయంటూ యూపీ ఓటర్లను ఉద్దేశించి రాజాసింగ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మంగళహాట్ పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ కేసు నమోదైంది. అంతేకాదు 72 గంటల పాటు ఆయన ప్రచారంపై నిషేదం విదించింది. రాజాసింగ్ పై కేసు నమోదు కావడం సంచలనంగా మారగాయయ తాజాగా తనను చంపేసేందుకు కుట్రలు జరుగుతున్నాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
ఇవి కూడా చదవండి ..
- మంత్రి మేకపాటి మృతికి అసలు కారణం ఇదేనా?
- కేసీఆర్ కూటమిలో ప్రకాష్ రాజ్ కీ రోల్!
- కేసీఆర్ కు షాకిచ్చిన మహారాష్ట్ర సీఎం!
- భూముల క్రమబద్దీకరణకు నేటి నుంచి దరఖాస్తులు
- బెంగళూరు ఎయిర్పోర్టులో రూ.9.8 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం