
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ : తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వరి ధాన్యం కొనుగోలు అంశంపై పోటాపోటీ సవాళ్లు చేసుకుంటున్నారు కారు, కమలం పార్టీ నేతలు. తాజాగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై టీఆర్ఎస్ ఎమ్మెల్సే ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్పై అవాకులు చెవాకులు పేలితే ఎంపీ అరవింద్ బట్టలు ఊడదీసి కొడతాం, జాగ్రత్త అని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర రైతులు పండించిన ధాన్యాన్నికేంద్రమే కొనాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఆధ్యర్యంలో తుంగతుర్తిలో జరిగిన మహా ధర్నాలో ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఈ కామెంట్లు టేషాకు.
ఎంపీ అర్వింద్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని గాదరి కిషోరు కుమార్ సూచించారు. కేసీఆర్పై అవాకులు చెవాకులు పేలుతున్నవ్ జాగ్రత్త అన్నారు. నిజామాబాద్ ఎంపీగా గెలిచి పసుపు బోర్డు తీసుకువస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి పారిపోయాడని ఎద్దేవా చేశారు. బోర్డు తీసుకురావడం చేత కాదు కానీ, కేసీఆర్పై అవాకులు, చెవాకులు పేలుతున్నవ్.. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు బిడ్డ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు గాదరి. తెలంగాణ రైతులు, ప్రజలు తలుచుకుంటే బండి సంజయ్ గానీ, గుండు అరవింద్ గాని బయట తిరుగుతారా అని ఆయన ప్రశ్నించారు. కెమెరా కనపడగానే మీ ఇష్టం వచ్చినట్టు గా మాట్లాడటం కాదు.. రైతులకు మద్దతుగా పోరాటం చేయాలన్నారు. రైతు వ్యతిరేక చట్టాలు చేస్తే ఇక్కడి నుండే ఢిల్లీకి వచ్చి జంతర్మంతర్ వద్ద ధర్నాలు చేస్తామన్నారు. అవసరమైతే తామందరం వచ్చి భారత దేశానికి మీ నిజ స్వరూపం తెలియజేస్తామన్నారు. కేసీఆర్కు అండగా, బాసటగా తామంతా ఉంటామన్నారు గాదరి కిషోర్ కుమార్.
ఇవి కూడా చదవండి …
- ఇందిరా పార్క్ సాక్షిగా కేసీఆర్ ఇజ్జత్ పాయే!
- వరదల్లో స్టాలిన్..ప్యాలెస్ లో జగన్! ఏపీ ప్రజలకు దిక్కెవరు?
- సీఎం జగన్ బిచ్చం ఎత్తుకుంటున్నారు.. మంత్రి కామెంట్లతో కలకలం..
- చట్ట వ్యతిరేక చర్యలపై పోలీసుల కొరడా..!