
సరిహద్దు రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలపై దృష్టి పెట్టండి
అకస్మీకంగా తనిఖీలు చేపట్టండి
నిందులపై పీడీ యాక్ట్ కేసులు వేగవంతంగా విచారణ చేపట్టండి
వీడియోకాన్నరేన్స్లో సీపీ విష్ణు ఎస్.వారియర్ ఆదేశం
(ఖమ్మం ప్రతినిధి-క్రైమ్ మిర్రర్)
గంజాయి నేరస్థులు చెక్ పెట్టేందుకు క్షేత్రస్థాయిలో సమాచార, నిఘా వ్యవస్థను పటిష్ట పరిచి అవసరమైన వ్యూహంతో ముందుకు వెళ్లాలని పోలీసు కమిషనర్ విష్ణు యస్. వారియర్ పోలీసు అధికారులకు ఆదేశించారు. శుక్రవారం పోలీసు కమిషనర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పోలీసు అధికారులతో మాట్లాడారు. జిల్లాలో ఆసాంఘిక కార్యకాలాపాలకు పాల్పడే నిందుతులపై కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు. గంజాయి వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడే క్రిమినల్స్ పై కేసులు నమోదు చేసి నిందుతులకు శిక్ష పదేలా చర్యలు చేపట్టాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణా నియంత్రణ క్రమంలో ఎంతటివారైనా ఉపేక్షించొద్దన్నారు.
జిల్లా సరిహద్దుల నుండి వచ్చే అక్రమ రవాణా నియంత్రించేందుకు మూలాలను, కీలక వ్యక్తులను గుర్తించాలని సూచించారు.నేరాలు జరగకుండా వుండేందుకే అవసరమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. నేరాలకు పాల్పడుతున్న నిందుతుల జాబితాను సిద్ధం చేసి పి.డి యాక్ట్ అమలు చేయాలని సూచించారు. గంజాయి, మాదకద్రవ్యాల వంటి అక్రమ రవాణాను పసిగట్టే నార్మోటిక్ డ్రగ్స్ పోలీసు జాగిలాను ఉపయోగించాలని సూచించారు.
సరిహద్దు రాష్ట్రాల నుండి వచ్చే వాహనాలపై దృష్టి సారించి… ఆకస్మిక తనిఖీలు చేపట్టాలన్నారు. గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు పటిష్టమైన వ్యూహాంగా ముందుకు వెళ్లాలని సూచించారు. నేరగాళ్లకు చెక్ పెట్టేందుకు క్షేతస్థాయిలో సమాచార, నిఘా వ్యవస్థ పటిష్టం చేయాలని సూచించారు. గంజాయి క్రయవిక్రయాలపై ఫోకస్ చేయాలని, స్థానిక పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా వుండాలని, ఎస్ఐ, సీఐలు ఆ విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.