
- బాలనగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
- లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ..
- సబ్ రిజిస్టార్, డాక్యుమెంట్ రైటర్
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: బాలానగర్ సబ్ రిజిస్ట్రార్గా విధులు నిర్వహిస్తున్న నిజాముద్దీన్ , డాక్యుమెంట్ రైటర్ జియాఉద్దీన్లు కుమ్మక్కయ్యారు. ఓ భూమికి సంబంధించి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయడానికి రూ . 75 వేలు లంచం అడిగినట్టు బాధితుడు షేక్ షరీఫ్ ఏసీబీకి ఫిర్యాదు చేశాడు.. బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు పథకం పథకం ప్రకారం సబ్ రిజిస్ట్రార్ నిజాముద్దీన్ , డాక్యుమెంట్ రైటర్ జియాఉద్దీన్లను లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ప్రస్తుతం బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. నిజాముద్దీన్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కడపటి సమాచారం మేరకు ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.