ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత
గత మూడు రోజులుగా వరుస కథనాలను ప్రచురిస్తున్న క్రైమ్ మిర్రర్
అనిల్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఆరు గుంటల భూమి కబ్జా చేసిందన్నది అక్షరాలా నిజమేనని తేలింది
( క్రైమ్ మిర్రర్ ప్రత్యేక ప్రతినిధి)
మంగల్ పల్లి పటేల్ గూడా సర్వే నెంబర్ 96 లో ని నాలుగు ఎకరాల 36 గుంటల భూమిలోని ఆరు గుంటల స్థలాన్ని అనిల్ కన్స్ట్రక్షన్ కంపెనీ కబ్జా చేసిందన్నది అక్షరాలా నిజమని తేలింది. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి సదరు నిర్మాణ కంపెనీ చేపట్టిన ప్రహరీ గోడని, నిర్మాణ కూలీల కోసం నిర్మించిన మరుగుదొడ్లను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. మంగళ్పల్లి పటేల్ గూడా సర్వేనెంబర్ 96లో ని ప్రభుత్వ భూమిని అనిల్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఆక్రమించి నిర్మాణాలను చేపడుతోందని, గత మూడు రోజుల నుంచి క్రైమ్ మిర్రర్ దినపత్రిక వరుస కథనాలను ప్రచురిస్తున్న విషయం తెలిసింది.
క్రైమ్ మిర్రర్ దినపత్రికలో ప్రచురిస్తున్న వరుస కథనాలకు రెవెన్యూ అధికారులు స్పందించారు. బుధవారం నాడు ఉదయం అనిల్ కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రభుత్వ భూముల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.