క్రైమ్ మిర్రర్, ఖమ్మం జిల్లా ప్రతినిధి : మార్కులు తక్కువగా వచ్చాయని పదో తరగతి విద్యార్థులను పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు చితకబాదాడు. దీంతో విద్యార్ధుల వీపులపై వాతలు తేలాయి. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని మాదిరిపురం అడ్డరోడ్డు వద్ద ఉన్న తెలంగాణ గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే.. మాదిరిపురం గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో పదో తరగతిలో 62 మంది విద్యార్థులున్నారు. పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో పదో తరగతి విద్యార్ధులకు తెలుగు ఉపాధ్యాయుడు లక్ష్మణ్రావు ఇటీవల గ్రాండ్ టెస్ట్ నిర్వహించారు.
Read Also : నేడు కొడంగల్లో సీఎం రేవంత్ పర్యటన.. తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో
ఈ పరీక్షలో కొందరు విద్యార్ధులకు తక్కువ మార్కులు వచ్చాయి. దాదాపు 25 మంది విద్యార్థులను బ్లాక్బోర్డు తుడిచే డస్టర్తో మంగళవారం రాత్రి కొట్టారు. దీంతో విద్యార్ధుల వీపులు ఎర్రగా కమిలిపోయాయి. ఈ విషయమై కొందరు విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ఫోన్లో ఉపాధ్యాయుడు కొట్టిన సంగతి తెలిపారు. గురుకులానికి సమీపంలో ఉన్న చంద్రుతండాకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని ఉపాధ్యాయుణ్ని పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై గిరిధర్రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించినట్లు మీడియాకు తెలిపారు.
ఇవి కూడా చదవండి :
- మహాజాతరకు నేడే అంకురార్పణ.. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ
- ఆ ఊరికి దెయ్యం పట్టిందా?.. చచ్చిన తర్వాత కూడా పీక్కుతింటోందా?
- మూడు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం.. కాంగ్రెస్కు రెండు, బీఆర్ఎస్ పార్టీకి ఒక స్థానం
- బీఆర్ఎస్ తో పొత్తు అంటే చెప్పుతో కొట్టండి.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
- ఢిల్లీకి గులాబీ బాస్ కేసీఆర్.. సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నా కేసీఆర్ టూర్!!
One Comment