

క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : అధికార తృణమూల్ కాంగ్రెస్కి ఓటు వేయాలని, పశ్చిమబెంగాల్లోని బీహార్ ప్రజలకు ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ పిలుపునిచ్చారు. సెచులర్ పార్టీల మధ్య ఐక్యత కొసమే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిశానని అయన స్పష్టం చేసారు. రాష్ట్ర సెక్రటేరియట్లో దీదీని కలిసిన తరువాత, బెంగాల్లో బీజేపీని అడ్డుకోవ డమే తమ పార్టీ ప్రథమ ప్రాధాన్యత అని ప్రకటిం చారు. రాబోయే ఎన్నికలు ‘‘ఆదర్శాలు, విలువ లను కాపాడుకునేందుకే’’ పశ్చిమబెంగాల్ వచ్చానని తేజస్వి చెప్పారు. ‘‘మా పార్టీ మమతా బెనర్జీకి సంపూర్ణ మద్దతు తెలుపుతోంది’’ అని ఆయన స్పష్టం చేశారు.
పశ్చిమ బెంగాల్లో 8 విడతలను వ్యతిరేకిస్తూ సుప్రీంకు
పశ్చిమబెంగాల్లో 8 విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నట్టు ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ, న్యాయవాది ఎంఎల్.శర్మ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. పశ్చిమ బెంగాల్లో 8 విడతలుగా ఎన్నికలు జరపడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, ఆర్టికల్ 21కి వ్యతిరేకమని, 8 దఫాల ఎన్నికల నిర్వహణను నిలిపేవేయాని కోరారు.