
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : టీఆర్ఎస్ ను ఎదిరించే సత్తా బీజేపీకే ఉందంటూ కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నమోదైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చూస్తే బీజేపీ సత్తా ఏంటో అర్థమవుతోందని అన్నారు. గ్రేటర్ ఫలితాలు వెలువడుతున్న సమయంలో ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు ఉద్యోగులు పూర్తిగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారన్న విషయం పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో స్పష్టమైందని, అంతేగాకుండా టిఆర్ఎస్ ను ఎదిరించే సత్తా బీజేపీకే ఉందనే విషయం వారు ఖచ్చితంగా నమ్ముతున్నారని ఆయన చెప్పారు. అయితే ఓ కాంగ్రెస్ నేత మరో పార్టీని ప్రశంసించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది అయితే విశ్వేశ్వర్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.