
- క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : టీఆర్ఎస్ నుంచి గ్రేటర్ మేయర్ అభ్యర్థిగా కార్పోరేటర్ సింధూ ఆదర్శ్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చడం మ్యాజిక్ ఫిగర్ ను సునాయాసంగా చేరుకోవడంతో మేయర్ అభ్యర్థి ఎంపికపై టీఆర్ఎస్ అధిష్టానం దృష్టి పెట్టింది. భారతీ నగర్ డివిజన్ నుంచి రెండోసారి కార్పోరేటర్గా గెలుపొందిన సింధుకు ప్రగతిభవన్ కు రావాల్సిందిగా టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం. డిప్యూటీ మేయర్గా బాబా ఫసియుద్దీన్ కు అవకాశమే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బాబా ఫసియుద్దీన్ బోరబండ నుంచి రెండోసారి కార్పొరేటర్గా విజయం సాధించారు.