
క్రైమ్ మిర్రర్ నల్లగొండ : నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య హఠాన్మరణం చెందారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన గతకొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. నర్సింహాయ్య యువకుడిగా ఉన్న సమయంలోనే మెదడులో కణితి ఏర్పడింది. ఆ కణితికి సంబంధించి శస్త్రచికిత్స చేసుకునేందుకు విదేశాలకు సైతం వెళ్లారు. అయితే కణితికి సంబంధించి శస్త్రచికిత్స చేస్తే మెదడుకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉండడంతో ఆపరేషన్ చేయించుకోలేదు. దీంతో ఆ కణితి అలాగే ఉండిపోయింది. నోముల నర్సింహాయ్య ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఇద్దరు కూతుళ్లు విదేశాల్లో ఉంటుండగా, కొడుకు భగత్ నల్లగొండలో న్యాయవాదిగా పనిచేస్తూ తండ్రికి చేదోడువాదోడుగా నిలుస్తున్నాడు. నోముల మరణవార్త తెలుసుకున్న బడుగు, బలహీన వర్గాలకు తీరని లోటని చెప్పొచ్చు. నకిరేకల్, నాగార్జునసాగర్ నియోజకవర్గాలు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయాయి. పేదలకు సమస్యంటే ముందుండే నర్సింహాయ్య లేకపోవడాన్ని ఆ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నారు.